కథ :
పూర్వం ఒకానొక సమయంలో ఒక మహారాణి తనకోసం, తన తనయుల కోసం, తన రాజ్యంలో వున్న వారందరి శ్రేయస్సు, సుఖసంతోషాల కోసం మూల గౌరీ నోమును నోచుకుంటుంది. నోము కాలం అయిన అనంతరం ఉద్యాపనం చేసుకుంటుంది. ఆ రాజ్యంలో వున్న వారందరూ కూడా మహారాణితో కలిసి నోమును నిర్వహించుకున్నారు. నలువైపులా సందడి వాతావరణంతో ఆ రాజ్యమంతా కళకళలాడుతుండేది.
అయితే అంతలోనే పట్టపు మహారాణికి శత్రువులైన రాజులు ఆమె రాజ్యంపై దండెత్తుతారు. సంతోషంగా గడుపుతున్న మహిళలు, సైనికులతోపాటు... ఆ రాజ్యపు రాజును, రాణి బంధువులను చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరిని హతమార్చేశారు. ఆనందమయంగా విరసిల్లుతున్న ఆ రాజ్యమంతా ఒక్కసారిగా రక్తపాతంతో నిండిపోయింది. అందరూ తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఏం చేయాలో తెలియక పరుగులు తీస్తారు.
అప్పుడు ఆ రాజ్యపు రాణి జరుగుతున్న హత్యకాండను చూస్తూ యుద్ధ భూమిలో నిలిచిపోతుంది. తీవ్ర మనోవేనతో ఆమె కుంగికుశించిపోతుంది. ఆ సమయంలో ఆమె తన ప్రాణాలను, తన కుటుంబసభ్యుల ప్రాణాలను, తన రాజ్యాన్ని కొల్లగొట్టేందుకు వచ్చిన శత్రురాజులను, యమకింకరులను ఉద్దేశించి... పాటరూపంలో ఇలా అంటుంది...
పాట :
చంపుటకు వచ్చిన శత్రు సైన్యములారా.. ప్రాణాలు తీసేటి యమదూతలారా..
మూల గౌరీ భక్తి ముత్తయిదువ నేను.. మా తావులను వీడి మరలి వెళ్ళిపొండి..
పతి సౌఖ్యము నిలుపుకొనుటకు పసుపు వాయనమిచ్చేను..
సౌభాగ్యాలు నిలుపుకొనుటకు సువర్ణ వాయనమిచ్చేను..
ఇల్లు వాకిలి నిలుపుకొనుటకు భూములు వాయనమిచ్చేను..
తోటలు నిలుపుకొనుటకు తోవు చీర వాయనమిచ్చేను..
బిడ్డల సంతతి కోసం - బీరకాయల వాయనమిచ్చేను..
చిన్నిమనుమల సౌఖ్యం కోసం - చెరకుగడలు వాయనమిచ్చేను..
అల్లుళ్ళ సంతోషం కొరకు - అరిసెలు వాయనమిచ్చేను..
కూతుళ్ళ సౌభాగ్యాలకి - కుడుములు వాయనమిచ్చేను..
ప్రజల మేలును కోరి - పగడాల వాయనమిచ్చేను..
బంధువుల బాగును కోరి - బంతిపూలు వాయనమిచ్చేను..
రాజ్య క్షేమాన్ని కోరి - రత్నాలూ వాయనమిచ్చేను..
పాడిపంటల అభివృద్ధి కోసం - పాయసం వాయనమిచ్చేను..
అందరికన్నా గొప్పతనానికి - అద్దాలు వాయనమిచ్చేను..
పేరు ప్రతిష్టా కోసం - పెరుగన్నం వాయనమిచ్చేను..
ప్రాణభయాలు రాకుండా - పరమాన్నం వాయనమిచ్చేను..
కోరీకలన్నీ తీరేందుకు - కొబ్బరి కాయ వాయనమిచ్చేను..
అకాలమరణాలు లేకుండా - అరటి పండ్లు వాయనమిచ్చేను..
ఇరుగువారి మేలు కోరి - యిప్పపూలు వాయనమిచ్చేను..
పొరుగు వారి మేలు కోరి - పొగడపూలు వాయనమిచ్చేను..
పడుచు పిల్లల మేలు కోరి - పావడాలు వాయనమిచ్చేను..
ఆనారోగ్యాలు కలక్కుండా - అప్పాలు వాయనమిచ్చేను..
శాంతీ సౌఖ్యాల కోసం - చలిమిడి వాయనమిచ్చేను..
అందరి మేలూ కోరి - అడిగిన వల్లా వాయనమిచ్చేను..
ఆదినారాయణుడి దయ కోసం అడగనివి కూడా వాయనమిచ్చేను..
చంపుటకు వచ్చిన శత్రువులారా.. ప్రాణాలు తీసేటి యమదూతలారా..
మూల గౌరీ నోము ముత్తయిదువ నేను.. మా జీవముల వదలి మరలి వెళ్ళండి..
అంటూ పాటరూపంలో తన మనసులో వున్న బాధను వెళ్లగక్కుతుంది. వెంటనే మూల గౌరీ దేవి తన భర్త అయిన పరమేశ్వరునితో సహా ఆమె ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ రాజ్యంలో చనిపోయి పడివున్న వారందరినీ పునర్జీవులను చేసి.. తిరిగి యుద్ధంలో గెలిచేలా ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు రాణి తన సైన్యాధికారంతో కలిసి తనపై దండెత్తిన శత్రురాజులను హతమార్చి, జయిస్తుంది. తరువాత వారందరూ సుఖసంతోషాలతో తమ జీవితాన్ని కొనసాగించారు.
విధానం :
ప్రతిరోజూ ఉదయాన్నే లేచి, రోజువారి కార్యక్రమాలు ముగించుకున్న తరువాత అభ్యంగన (అభిషేక) స్నానాన్ని ఆచరించుకోవాలి. పైన చెప్పుకున్న కథను స్మరించుకుని, అక్షతలు వేసుకోవాలి. తమకు ఏం కావాలో మనసులో కోరుకున్న తరువాత అనువైన వస్తువులను ఐదుగురు ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ఉదాహరణకు ఐదుగురు ముత్తయిదువులకు ఒక్కొక్కరికి చొప్పున ఐదు పనసకాయలను వాయనమివ్వాలి.
ఉద్యాపనం :
ఐదుగురు ముత్తయిదువులను గౌరవ మర్యాదలతో ఇంటికి పిలిచి.. వారికి బొట్టుకాటుక పెట్టి ఆహ్వానం పలకాలి. తరువాత వారికి భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. తరువాత వాళ్లు వెళ్లే సమయంలో మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని.. అనువైన వస్తువులను ఐదు చొప్పున దక్షిణ తాంబూలాలతో ముత్తైదువులకు వాయన దానాలు ఇవ్వాలి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా - ఓం నారాయణాయ స్వాహా - ఓం మాధవాయ స్వాహా - ఓం గోవిందాయ నమ: - విష్ణతే నమ: మధుసూదనాయ నమ: - త్రివిక్రమాయ నమ: -... Read more
Jun 03 | ప్రాచీనకాలం నుంచి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి... అష్టైశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది. ఆనాడు సాక్షాత్తూ దేవుళ్లు కూడా... Read more
Apr 17 | కథ : పూర్వం ఒక రాజు కూతురు, బ్రాహ్మణ కూతురు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని గడిపేవారు. వీరిద్దరి జీవితంలో ఏ ఒక్క లోటు వుండేది కాదు. అయితే ఒకరోజు వీరిద్దరూ... Read more
Apr 16 | కథ : పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను ‘‘చిత్రాంగి’’ అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు. ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు... Read more
Apr 15 | పురాణ కథ : పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు వుండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా తమ జీవితాన్ని సంతోషంగా గడిపేవారు. బ్రాహ్మణ ఇల్లాలికి నలుగురు తమ్ముళ్లు వుండేవారు. అయితే తమ్ముళ్ల పెళ్లి వచ్చేసరికి ఆ... Read more