ప్రతిఒక్కరు తమ ఇష్టదైవాన్ని పూజించుకునే సమయంలో నైవేద్యంగా కొన్ని పళ్లను వుంచుతారు. వాటితోపాటు కొన్ని పూలను ఇంకా ఇతర సామాగ్రీలను కూడా వుంచుతారు. అయితే కొన్నిరకాల పళ్లను ఇటువంటి పూజా కార్యక్రమాల్లో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతోసహా సిరిసంపదలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు, పురోహితులు పేర్కొంటున్నారు. అవేమిటో ఒకసారి చూద్దాం....
దేవునికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయి. అలాగే వీటిని ఇంట్లో వున్న చిన్నపిల్లలకు, పెద్దలకు పంచిపెడితే.. గృహంలో నిత్యం సుఖసంతోషాలు వుంటాయి.
అదేవిధంగా దేవుని పూజకోసం జామపళ్లను నైవేద్యంగా పెడితే.. జీవితంలో రాజగౌరవంతోపాటు నలుగరితో మంచి సత్కారాలు పొందుతారు.
శ్రీగణపతికి జామపండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన గ్యాస్ట్రిక్, ఉదర వ్యాధులు దూరం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
దేవీ దేవాలయానికి జామకాయను నైవేద్యంగా పెట్టి, వాటిని సుమంగళులకు పంచితే చక్కర వ్యాధి తగ్గిపోతుంది.
పెళ్లికాని అమ్మాయిల చేతులమీదుగా జామపండులతో పూజ చేయించి, సుమంగుళులకు తాంబూలాలు ఇస్తే.. మంచి వరుడు లభిస్తాడు.
గౌరీ పూజకు నైవేద్యంగా వుంచిన జామపండును తినడం వల్ల మనసులో వున్న మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా వుంటారు. కోరిక కోరికలు కూడా నెరవేరుతాయి.
దుర్గాదేవీకి దీపనమస్కారాలు చేసే సమయంలో జామపళ్లను నైవేద్యం చేసి, సంతానం లేనివారికి ఇస్తే.. సంవత్సరంలోపు వారికి పిల్లలు పుడతారు.
శ్రీలక్ష్మీనారాయన దేవునికి నైవేద్యంగా పెట్టిన జామపళ్లను కొత్త దంపతులకు తినడానికి ఇస్తే.. వారిమధ్య కలహాలు వుండకుండా, సంతోష జీవనాన్ని కొనసాగిస్తారు.
సంకష్ట హర గణపతికి జామపళ్లను నైవేద్యంగా పెట్టి, బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి ఇస్తే.. దేహంలో వుండే నీరసం తగ్గిపోయి... ఆరోగ్యవంతంగా, ఉత్సాహంగా వుంటారు.
ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే చక్కెర వ్యాధి దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి.
రుద్రాభిషేకం సమయంలో జామపండు, కమలాపండు రసాలతో దేవునికి అభిషేకం చేసి, ఇతరులకు జామపళ్లను దానం చేస్తే.. నిదానంగా జరిగే పనులు త్వరితంగా పూర్వవుతాయి.
దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేయించి, తాంబూలంతోపాటు జామపళ్లను సంకల్పసమేతంగా దేవునికి కుడివైపు వుంచి ప్రార్థన చేసుకుంటే.. ఆదాయంలో అధికంగా లాభం కలుగుతుంది, సిరిసంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more