చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటన, ఇలాంటి ప్రకటన ఎక్కడ వచ్చి ఉండదు. కానీ తొలిసారిగా మన దేశంలో ఇలాంటి పథకం ఒకటి ప్రవేశపెట్టారు. కేవలం ఐదురూపాయలకే సీఎం. ఇంత చీపుగా సీఎం రేటు ఏమిటి అని ఆలోచించకండి? ఆ సీఎం రేటు అంతే. మహిళ సీఎం మాత్రం కాదులేండి? ఈ సీఎం పదని పదవికి నిచ్చేన వేస్తున్న నాయకుడు, వరుసగా మూడుస్లారు సీఎం అయ్యిన బ్యాచ్ లర్ నాయకుడు. ఐదు రూపాయలు ఇస్తే చాలు ఆ సీఎం తో పాల్గొన్నవచ్చు. మరోల అనుకోకండి.. ఆయన చెప్పే మీటింగ్ లో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. ముఖ్యమంత్రి మీటింగ్ కు 5 రూపాయలు టిక్కెట్ పెట్టారు. టిక్కెట్ తీసుకోని బ్యాచ్ లర్ ముఖ్యమంత్రి చెప్పే ప్రసంగాలను వినవచ్చు. ఇంతకీ ఆయన ఎవరో కాదు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. ఆయన చేస్తున్న రథయాత్రలో భాగంగా ఇలాంటి పథకం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మోడీ బహిరంగ సభ ప్రవేశానికి 5 రూపాయలు చార్జీగా వసూలు చేయాలన్న బీజేపీ నిర్ణయంపై కేంద్ర మంత్రి సచిన్ పైలట్ విమర్శలకు దిగారు. ''బాబా ప్రవచనానికి చార్జీ 100 రూపాయల నుంచి లక్ష రూపాయలు. అదే బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన సినిమాకైనా టికెట్ చార్జీ 200 నుంచి 500 రూపాయల వరకు ఉంది. సీఎం సభకు టికెట్ చార్జీ మాత్రం 5 రూపాయలు.
ఇది గుజరాత్ ముఖ్యమంత్రి అసలైన విలువను తెలియజేస్తోంది అంటూ మనీష్ తివారీ వ్యంగంగా విమర్శించారు. అయితే ఈ 5 రూపాయలు వెనుక చాలా కథ ఉందని కొంతమంది నాయకులు అంటున్నారు. మోడీ హైదరాబాద్ లో నిర్వహించనున్న సభకు మాత్రం ఎంట్రీ టికెట్ పెట్టారు. ఐదు రూపాయలు పెట్టి కొనుక్కుంటే గానీ మిమ్మల్ని సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వరు. ఆగస్టు 11న లాల్ బహదూర్ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. ఇందుకోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. 8,000 మంది తొలిరోజే టికెట్లను బుక్ చేసుకున్నారు. కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకూ సభకు వస్తారని బీజేపీ అంచనా.
ఎల్ బీ స్టేడియం ఒక రోజు అద్దె 3.75లక్షల రూపాయలు కాగా, దీనికి విద్యుత్ చార్జీలు అదనం. టికెట్ల విక్రయం ద్వారా కనీసం 5 లక్షల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో అద్దె ఖర్చు తీరిపోతుంది. అంటే ప్రజాసభ ఖర్చును ప్రజలే భరించనున్నారన్నమాట. అంటే సీఎం రేటు చీపుగా ఉన్న పథకం చాలా బాగుందని రాజకీయ కార్యకర్తలు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పెద్ద కమలం పువ్వులు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ పెడుతున్నాడని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇలా చెయ్యటం వల్ల రాబోయే రోజుల్లో ప్రజా సభలకు ప్రజలు కరువుతారని రాజకీయ వేత్తలు అంటున్నారు. ఈ పథకం చాలా బాగుందని బీజేపి నాయకులు మాత్రం చంకలు గుద్దుకుంటున్నార. ఇదీ అంత మోడీ మాయజలం అని కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more