రాజకీయంలో ఎన్నీ అస్త్రాలు ఉపయోగిస్తే.. అంత రాజకీయాల్లో ఎదుగుతారనే విషయం ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలే చెబుతున్నాయి. నిన్నటి వరకు పచ్చ చొక్క వేసుకున్న నాయకులు వేసవి తాపానికి ఒక్కసారిగా మూడు రంగుల చొక్క కిందకు చేరిపోతున్నారు. పచ్చ చొక్కతో ఫలితం శూన్యం అని నమ్మిన నాయకులు .. మూడు రంగుల చొక్కతో కలిసి పచ్చ చొక్క లో ఉన్న మరకల గురించి రాష్ట్ర ప్రజలకు చెబుతున్నారు. రాజకీయంలో సెంటిమెంట్, అనుభవం, సింపతి భావం ఉంటే చాలు.. రాజకీయల్లో తిరుగులేని కింగ్ లాగ మారిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రను మార్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలకు కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి సత్తా ఏమిటో జాతీయ పార్టీలకు రుచి చూపించిన ఘనత ఎన్టీఆర్ దే. అలాంటి ఎన్టీఆర్ ఫోటోను, ఇప్పుడు ఓట్లు కోసం అన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ప్రత్యర్థి పార్టీల సైతం ఆయన ఫోటో పై మక్కువ పెంచుకున్నాయి. ఎన్టీఆర్ ఆశయాలను, ఆయన ఫోటోలను వాడుకునే హక్కు నైతికంగా టిడిపి పార్టీకే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నుండి వెళ్లిపోయిన నాయకులు ఎన్టీఆర్ ఫోటో పై పెత్తనం చేస్తున్నారు. తాజాగా వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్రలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ను, వైఎస్ఆర్ ఫోటోను కలిపి ఒక ప్లేక్సీలో ప్రచురించారు వైసీపీనాయకులు. ఈ విషయం పై టిడిపి నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ ఫోటో పెడితే ఓట్లు రావటంలేదని సీనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి జనం దగ్గర ఓట్లు అడుక్కుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే అందుకు వైసీపి నాయకులు సీనియర్ ఎన్టీఆర్ కడుపున పుట్టిన బిడ్డలే పదవుల కోసం, కాంగ్రెస్ పార్టీలో రాజ్యం వేలుతుంటే తప్పులేదుగానీ, మేము ఆయన ఫోటో వాడుకుంటే తప్పు జరిగిందా అని టిడిపి నాయకులకు కౌంటర్ వేస్తున్నారు.
మేము సీనియర్ ఎన్టీఆర్ అభిమానులం, ఆయన కోసం ఏమైన చేస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ ను వదిలి పెట్టి.. మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన మంత్రి పురందేశ్వరి సంగతి ఏమిటని.. వైసీపీ నాయకులు అడుగుతున్నారు. అసలు రాష్ట్రానికి మంచి నాయకులు ఎవరు? అని ప్రశ్నించుకుంటే. ముఖ్యంగా ఇద్దరి పేర్లు ప్రజల నాలుకల మీద వినబడుతున్నాయి. ఒకరు అఖిల ఆంధ్రులకు ఆదర్శమైన నాయకుడు నందమూరి తారక రామారావు. మరోకరు ప్రజల్లో మహనేతగా ఎదిగిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ ఇద్దరి పేర్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లిన మనకు వినిపిస్తుంటాయి. సీనియర్ ఎన్టీఆర్ మరణించి ఇప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అయిన రాష్ట్ర ప్రజలు సీనియర్ ఎన్టీఆర్ పేరును మరిచిపోలేదు, కారణం ఆయన రాష్ట్ర ప్రజలకు చేసిన మంచిపనులే. అలాగే వైఎస్ఆర్ చనిపోయి మూడు సంవత్సరాలు గడిసిపోయినా, రాష్ట్ర ప్రజలు మాత్రం ఆయన పేరు మరిచిపోలేదు. ఇప్పుడు విమర్శలు చేసే నాయకులు గతంలో ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన నాయకులే ఆయన ఫోటో వాడుకుంటున్నారు. ముందు వారు సిగ్గుపడాలని వైసీపి నాయకులు అంటున్నారు. తెలుగు ప్రజలకు మేలు చేసిన నాయకుడు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ . ఆయన ఫోటోను ఎవరైన వాడుకోవచ్చునని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ ఫోటల విషయంలో రాష్ట్ర ప్రజలు, పార్టీల కార్యకర్తలు అయోమయంలో పడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more