మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వహిస్తున్న బ్రైడ్స్ ఆఫ్ ఇండియా నగల ఫెస్టివల్ సీజన్-3 ప్రీవ్యూ కోసం ఆ సంస్థ ప్రచారకర్త, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడకు చేరుకున్నారు. మహ్మాత్మగాంధీ రోడ్డులోని గేట్ వే హోటల్ వద్ద అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. తాతా గారికి తప్పితే ‘అన్నా’ అని పిలిపించుకునే హక్కు ఎవరికీ లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తను తమ్ముడిలాగే ఉంటానన్నారు. విజయవాడ కన్నా బెజవాడ అని పిలవడమే తనకు ఇష్టమని, బెజవాడకు తానెప్పుడూ రుణపడి ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పటం విజయవాడ టిడిపి నాయకులు, నందమూరి అభిమానులు అయోమయంలో పడ్డారు. ఎన్టీఆర్ స్వరంలో ఒక మార్పు వచ్చినట్లు టిడిపి నాయకులు అంటున్నారు. బెజవాడ అంటే నాకు ఇష్టం, మీ కుటుంబంలో నేను ఒకడిని అని చెప్పటం, నన్ను మీరు ఆదరించండని ఎన్టీఆర్ మాట్లాడిన తీరు పై కొత్త అనుమానాలు వస్తున్నాయని టీడీపీ పార్టీ నాయకులు అంటున్నారు. బెజవాడకు వచ్చిన ఎన్టీఆర్ పక్కన ఆయన అభిమానులు తప్పు , బాలయ్య అభిమానులు గానీ, టీడీపీ కార్యకర్తలుగానీ, హరిక్రిష్ణ అభిమానులు గానీ ఎవరు లేనట్లు మీడియా వర్గాలు అంటున్నాయి.
ఈ విషయంలో బాలయ్య చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ విజయవాడలో అడుగుపెట్టినప్పుటి నుండి బాలయ్య టీవీ ముందు కూర్చోని ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా విజయవాడ టిడిపి నాయకులతో బాలయ్య ప్రతి పది నిమిషాలకు ఫోన్ చేసి ఎన్టీఆర్ సమాచారం తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ విషయాన్ని ముందే పసిగట్టి, తన మాట తీరు మార్చినట్లు తెలుస్తోంది. బాలయ్య మాటను విజయవాడ టిడిపి కార్యకర్తలు తు.చ పాటించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను దూరం నుంచి టిడిపి కార్యకర్తలు చూసి వెళ్లినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఒకరకంగా చెప్పలంటే.. బాలయ్య కు ఎన్టీఆర్ షాకిచ్చినట్లేననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బాలయ్య కార్యకర్తలను భయపెట్టి ఎన్టీఆర్ ను కలవకుండా చేసినప్పటికి, జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరి మనసును టచ్ చేసిందని అంటున్నారు.
బెజవాడలో బాలయ్య కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ మంది అభిమానులు ఉన్నట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. బాలయ్య అభిమానుల మీద అధికారం చెలాయిస్తే, ఎన్టీఆర్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటున్నారని, నందమూరి అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ మాట్లాడింది కొన్ని నిమిషాలైన .. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ప్రతి ఒక్కరు ఆలోచించే విధంగా మాట్లాడి బెజవాడ ప్రజల మనసు గెలుసుకోని హైదరాబాద్ బయలుదేరినట్లు బెజవాడ ప్రజలు అంటున్నారు. బాబాయ్ కు అబ్బాయ్ భలే షాకిచ్చారని బెజవాడ టీడీపీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more