తెలుగుదేశం పార్టీకి ఈ ఘోరమైన పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది..? ఈ దారుణ పరిస్థితి పార్టీ అధ్యక్షుని నిర్ణయాలే కారణమా...? అనే ప్రశ్నలకు పలు అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు విశ్లేషకులు. అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరుగుతున్నా తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుంటోంది. ఎంతమాత్రం పోటీని ఇవ్వలేకపోతోంది. జగన్ మోహన్ రెడ్డి అవినీతిని అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబు నాయుడి మాటలను పట్టించుకోలేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితికి కారణం ఆయన వైఖరే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణా ఉద్యమం సమయంలో ఆయన స్పష్టమైన వైఖరి వెల్లడించడంలో మీనమేషాలు లెక్కించారన్నది వారి వాదన. దీంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నమ్మేవారు కరవయ్యారు. ఇకపోతే.. సీమాంధ్రలో యువనేత జగన్ మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని ఎంతగా చెప్పినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. అసలు చంద్రబాబు నాయుడు చెపుతున్న మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్న వాదనలు సైతం వినిపిస్తున్నారు
సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఒక్క ఉపఎన్నికా... టీడీపీ కలిసిరావడంలేదు. కలిసిరాకపోగా పార్టీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ 12 మంది రాజీనామాతో జరిగిన ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాబ్లీ అంశాన్ని నెత్తినెత్తుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. బాన్సువాడ ఎన్నికల్లో తన అభ్యర్ధినే దించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఆరు స్థానాల ఎన్నికలో కూడా ఫలితాలు నిరాశజనకంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్, కొల్లాపూర్ లో మెరుగైన ఓట్లు సాధించినా...చాలా చోట్ల డిపాజిట్లు కోల్పయింది. మొన్న జరిగిన పరకాల ఎన్నికలో కూడా ఇదే రకమైన పరిస్థితి ఎదురవుతుందని టీడీపీ ఆందోళన చెందుతోంది. తమకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని జనం సంక్షేమమే ముఖ్యమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. రానున్న జనరల్ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా ప్రధాన పార్టీలు భావించాయి. నిన్న జరిగిన పోలీంగ్ తీరుతెన్నులు తమకు అనుకూలంగా లేవని పార్టీ అంతర్గతంగా విశ్లేషిస్తోంది. గుంటూరు జిల్లాలో మాచర్ల, ప్రత్తిపాడు, కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా రాయదుర్గం, విశాఖ జిల్లా పాయకరావుపేట, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, ఒంగోలు నియోజవర్గాలపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణాసెంటిమెంట్...జగన్ సింపతీ తమ కొంపముంచుతున్నాయని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉప ఎన్నికలు టిడిపికి ఈ సారి కూడా పాతకథే పునరావృతం అయ్యిందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ శాపం తగిలిందని కొందరు టిడిపి నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more