ఇప్పుడు సిబిఐ కన్ను కేవీపి, పెన్నా ప్రతాపరెడ్డిపై పడినట్లు తెలుస్తుంది. ఢిల్లీ నుండి అనుమతి కోసం సిబిఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. 2004లో చిన్న గదిలో ఉండే కేవీపి 2012 కల్లా .. శ్రీకాకులంలో పవర్ ప్రాజెక్టు, ఢిల్లీలో ఆస్తులు, దుబాయ్ లో పెట్టుబడులు కేవిపీ ఎలా వచ్చాయి అనే దాని పై సిబిఐ ఆరా తీస్తున్నట్లు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న జగన్ను తొలిరోజున ప్రశ్నించటం పూర్తయింది. మరో నాలుగు రోజులు అంటే ఈ నెల ఏడు దాకా ఆయనను ప్రశ్నించాల్సి ఉంది. ఆ గడువు పూర్తి అయ్యే లోగానే కేవీపీని, పెన్నా ప్రతాపరెడ్డిని కూడా పిలిపించి విచారించాలని, వారు వెల్లడించే అంశాలతో జగన్ చెప్పిన అంశాలను బేరీజు వేసి నివేదిక తయారు చేయాలని సీబీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని వారిద్దరికీ సమన్లు జారీ చేసేందుకు సీబీఐ కేంద్ర కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ అందినట్టు చెబుతున్నారు.
కేవీపీతో పాటు పెన్నా సిమెంట్స్ అధిపతి ప్రతాపరెడ్డికి సైతం సమన్లు జారీ చేయాలని సీబీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీలలో పెట్టుబడులు, ఆయన ఆస్తుల వ్యవహారంపై ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ నుంచి పూర్తి స్థాయి సమాచారం అందకపోవటంతో ఒకవైపు జగన్ను మరింత తరచి ప్రశ్నిస్తూనే వ్యవహారాన్ని అటువైపు నుంచి నరుక్కురావాలని సీబీఐ భావిస్తున్నది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కేవీపీ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం అయినా సీబీఐ ఇప్పటిదాకా ఆయనవైపు కన్నెత్తి చూడలేదు. ఎమ్మార్ ప్రాపర్టీస్, వ్యాన్పిక్, జలయజ్ఞం, ఏపీఐఐసీ భూముల కేటాయింపు, సాక్షి పత్రిక, మీడియాలోకి వెల్లువెత్తిన పెట్టుబడులు సహా అనేక వివాదాస్పద అంశాలపై దివంగత వైఎస్ తీసుకున్న నిర్ణయాల వెనుక కేవీపీ ప్రమేయం ఉందని అనేక మాసాలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కేవీపీని విచారణకు పిలవలేదు. ఆయనను విచారిస్తేనే పూర్తి సమాచారం వస్తుందన్న నిర్ణయానికి వచ్చిన సీబీఐ ఆ దిశగా కేంద్ర అధికారులను సంప్రదించినట్టు చెబుతున్నారు. కేవీపీ నోరు విప్పేలా చేస్తే అసలు వ్యవహారం అంతా ఒక కొలిక్కి వస్తుందని, జగన్ విషయం సైతం పూర్తిగా బయటపడుతుందని సీబీఐ భావిస్తున్నది.
జగన్ వ్యవహారం తేలాలంటే కేవీపీని పూర్తిగా విచారించాలని అన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత విహెచ్లాంటి వారు ఏకంగా కేవీపీని అరెస్టు చేసి విచారిస్తే అన్ని వివరాలు బయట పడతాయని పలు సందర్భాలలో చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వం వ్యూహం కూడా అదే కోణంలో సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ను ఒక్కడినే వేధిస్తున్నారని, ఆయన తండ్రికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ లాంటి వారు కాంగ్రెస్లో కొనసాగు తున్నందుకే రక్షిస్తున్నారని వస్తున్న ప్రచారం నుంచి బయటపడాలంటే కేవీపీ విచారణ జరిగితేనే మంచిదన్న ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో కేవీపీని కేవలం ప్రశ్నించి వదలివేస్తే వచ్చే నష్టమేమీ లేదని, అలా చేసినందువల్ల నిష్పక్షపాతంగా వ్యవహరించామని చెప్పుకునేందుకు ఆస్కారం ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానంలో ఒక బలమైన లాబీ వాదిస్తున్నట్టు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more