ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరులో ట్యాంక్ బండ మీద ఉన్న విగ్రహాలు సైతం భయపడిన విషయం తెలిసిందే. ఆ మిలియన్ మార్చ్ వల్ల ట్యాంక్ బండ మీద ఉన్న విగ్రహాల అసలు రూపాలు మారినాయి. అప్పటి నుండి రాష్ట్రంలో ఏం జరిగిన, ఏ తప్పు చేయ్యాని విగ్రహాలకు దెబ్బలు తగులుతున్నాయి. పాపం విగ్రహాలు బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. అవి మౌనంగా ఉండి వారికి సహకరించటం తప్ప ఏమీ చేయ్యలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటాయి. అంటే వాటికి ప్రాణం లేదు కాబట్టి.
అసలు విగ్రహాలు మీద దాడి ఎందుకు చేయ్యాలి? అని ఒక్కసారి ఆలోచించండి? అసలు విగ్రహాలు ఎందుకు పెట్టారు? విగ్రహాలు వల్ల ఉపయోగం ఏమిటి? అని ఎవరైన ఆలోచిస్తున్నారా? లేదు ఎందుకంటే ఎవ్వరికి అంత టైం లేదు కాబట్టి. ఎవరికి కోపం వచ్చిన ముందుగా కనబడితే విగ్రహాలే. వారి కోపాన్ని కనిపించే విగ్రహాల మీద తీర్చుకుంటారు. అదే కోపంతో చనిపోయిన మన తల్లి మీదనో, లేక తండ్రీ మీదనో .. తీర్చుకోగలమా? తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్లు మన కన్న తల్లిదండ్రులు కాబట్టి. వారు మంచి చేసిన, చేడు చేసిన కేవలం తల్లిదండ్రులనే బంధంతో వారి మీద కోపం తీర్చుకోం? ఇక్కడ అలాంటి సంఘటన ఒకటి జరిగింది.
దళితులు దైవంగా భావించే.. డాక్టరు అంబేద్కర్ పై ఈ మద్యకాలంలో దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా.. ఆ వర్గానికి సంబంధించిన ఒక దళిత నాయకుడే .. అంబేద్కర్ కు చెప్పులు దండ వేయించిన సంఘటన ఒకటి చోటు చేసుకుందట. అతను ఆ గ్రామానికి మాజీ సర్పంచ్ గా కూడా పనిచేశాడట. అంతే కాకుండా బీఎస్సీ పార్టీకి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడని .ఆ గ్రామ ప్రజలు అంటున్నారు.
నిజామాబాద్ జిల్లా జలాల్ పూర్ లో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు వేసింది. నీరడి లక్ష్మణ్ అనే అతను ఈ ఘాతుకానికి ఒడికట్టేడని గ్రామా ప్రజలు అంటున్నారు. అసలు ఆపని ఎందుకు చేసాడంటే.. అతను సర్పంచ్ గా ఉన్నప్పడు గ్రామా కోసం ఉంచిన 2 లక్షల రూపాయలను తన సొంత ఖర్చులకు వాడుకున్నాడట. అయితే దానిపై గ్రామా పెద్దలు విచారించి.. అతనిని డబ్బు కట్టాలని గడువు విధించారట. అతను ఎలగైనా 2 లక్షలు రూపాయలు ఎగ్గొట్టేందకు అనేక ప్లాన్లు వేసి చివరకు అంబేద్కర్ పై ప్రయోగం చేయాలని చూశాడట. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల అపచార ఘటనలు చోటు చేసుకుంటున్నసందర్బాలు.. అతనికి బాగా కలిసి వచ్చిందని గ్రామా పెద్దలు అంటున్నారు.
అతను వెంటనే ..జలాల్ పూర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తన బంధువైన గంగాధర్ తో చెప్పుల దండ వేయించి.. మరో ఇద్దరు వ్యక్తులను రాత్రంతా కాపలాగా ఉంచాడట. తెల్లవారిన తరువాత అతనే తన మనుషుల చేత పోలీసులకు ఫోన్ చేయించి.. తన మీద అనుమానం రాకుండా చూసుకున్నాడట. అతను తెలివిగా.. అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసింది అగ్రవర్ణాల వారేనని ప్రచారం కూడా చేయించి, గ్రామా ప్రజలతో పాటు .. హడావుడి చేయాటం ప్రారంభించాడని .. దళిత ప్రజలు అంటున్నారు. అయితే చివరకు జిల్లా కలెక్టర్ సీరియస్ గా తీసుకొని .. అసలు దళిత దొంగను పట్టుకున్నారని పోలీసు అంటున్నారు.
కొసమెరుపు: అతనిని పట్టించింది.. మనుషులు కాదట. పోలీసు జాగిలాలు రంగంలోకి దిగి నేరుగా అతని ఇంట్లో వెళ్లగా.. అక్కడ మరిన్ని పాత చెప్పులు ఉన్నాయట. అవి చూసి పోలీసులు, గ్రామస్థులు ఆశ్చర్యపోయారని .. గ్రామా ప్రజలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more