టాలీవుడ్ అగ్రనటీమణుల్లో ఒకరైన రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘గుడ్బై’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ బామ.. పుష్ఫ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే.. అయినా నేరుగా బాలివుడ్ లోకి అడుగుపెట్టిన చిత్రం మాత్రం ‘గుడ్ బై’. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో కలిసి ఆమె నటించిన గుడ్బై మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయాలని తలపించింది. కాగా ఈ చిత్ర ట్రైలర్ను రష్మిక తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. "మా గుడ్బై బేబీలోని కొంత పార్ట్ ఇప్పుడు మీ సొంతమవుతోంది. ఇది నాకెంతో స్పెషల్. ఈ ట్రైలర్ మీకు, మీ ఫ్యామిలీకి నచ్చుతుందని అనుకుంటున్నా" అంటూ రష్మికా కామెంట్ రాసింది.
గుడ్బై ఒక ఫ్యామిలీ డ్రామెడీ. తల్లి అంత్యక్రియలు నిర్వహణ విషయంపై కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణే ప్రధాన కథాంశంగా తీసుకున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇందులో రష్మిక తల్లిదండ్రుల పాత్రల్లో అమితాబ్, నీనా గుప్తా నటించారు. తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు ఫైట్ చేస్తుంది. వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయమిది.. అయినా ఇది బర్త్డే కాదు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అడిగి చేయడానికి అని ఆ తండ్రి వాదిస్తాడు. మొత్తానికి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఓ మనిషిని సాగనంపే సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా లేక సాంప్రదాయాన్నా అన్న చర్చను స్క్రీన్పై చూపించే ప్రయత్నం చేశారు.
ఒక రకంగా ప్రతి ఇంట్లో కనిపించే సున్నితమైన అంశాలనే కథాంశంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. క్వీన్ మూవీ ఫేమ్ వికాస్ బెహల్ గుడ్బై మూవీని డైరెక్ట్ చేశాడు. ఏక్తాకపూర్ నిర్మాత. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించాడు. ట్రైలర్ మొత్తం కామెడీ, డ్రామాతో సరదాగా గడిచిపోతుంది. రష్మికా మందన్నాకు బాలీవుడ్లో ఈ గుడ్బై తొలి మూవీ కానుంది. దీని తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్నూ మూవీలోనూ కనిపిస్తోంది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న యానిమల్ మూవీలో రణ్బీర్ కపూర్ సరసన నటిస్తోంది. ఇక గుడ్బై మూవీ అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more