మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన తొలి చిత్రం ‘ఆచార్య’. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపోందిన ఈ చిత్రం కోసం మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సైరా నరసింహారెడ్డి తరువాత ఇప్పటివరకు మరో చిత్రం విడుదల కాలేదు. ఇక తాజాగా 'ఆచార్య'.ఎప్పుడో పోస్ట్ పోడక్షన్ పనులు చేసుకున్నా.. కరోనా కారణంగా, ఇక వరుస పెట్టి విడుదల అవుతున్న మరికొన్ని చిత్రాల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూవచ్చింది. ఇక ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేశారు.
సందేశాత్మక చిత్రాలను రూపోందించడంతో పాటు హిట్ చిత్రాల దర్శకుడిగా ఖ్యాతి సంపాదించిన డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే చిత్ర ట్రైలర్ ఈ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చింది. మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్ర ట్రైలర్ కట్ చేయబడింది. ఈ సినిమాలో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తూ 'సిద్ధ' అనే పవర్ ఫుల్ పాత్రలో అలరించనున్న విషయం తెలిసిందే. అనేక సార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు 'ఆచార్య' తీసుకువస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 12న ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే మంగళవారం (ఏప్రిల్ 12)న సాయంత్రం 'ఆచార్య' ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలానే చిరంజీవి తనదైన నటనతో అబ్బురపరిచాడు. మణిశర్మ సంగీతం ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తుంటే ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు ఇంకాస్తా పెరిగేలా ఉన్నాయి. చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని సోషల్ మీడియాతోపాటు 152 ప్రత్యేకమైన థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు సోమవారం (ఏప్రిల్ 11) ప్రకటించిన విషయం తెలిసిందే. చేశాడు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్కు చెందిన కొత్త టీజర్ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more