పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ‘రాధే శ్యామ్’ మూవీ విడుదలైన తొలిరోజు నుంచి మిక్సిడ్ టాక్ సోంతం చేసుకుంది. అయితే పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ చిత్రం బాక్సీఫీసు వద్ద మాత్రం తొలివారంతం సందడి చేసింది. ఇండియాలో మొదటి సారి ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది రాధేశ్యామ్. పాజిటివ్ టాక్తో థియేటర్లకు ప్రేక్షకులు కదులుతున్నారు. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వస్తోంది.
ఈ మూవీలో ప్రభాస్జ్-పూజా హెగ్డేల కెమిస్ట్రీకి అందరూ ఫిదా అవుతున్నారు. అలాగే రాధా కృష్ణ కుమార్ టేకింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. సినిమాకు పెట్టిన ఖర్చుకు.. చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్కు.. ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్కు.. నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయిపోయారు. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసిందంటున్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.
ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ రాధే శ్యామ్ సినిమా మరోసారి నిరూపించింది. అత్యద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీ.. కట్టి పడేసే క్లైమాక్స్ సన్నివేశాలు రాధే శ్యామ్ సినిమాకు పాజిటివ్ గా నిలిచాయి. అయితే ఇదే సమయంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్. ఓటీటీలో విడుదల చేయడానికి కూడా రెడీ అయ్యింది. సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ అవ్వాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీని ప్రకారం ఏప్రిల్ 11 తర్వాత ఇది ఆన్లైన్లో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ ఏప్రిల్ 2న ఉగాది పండగ ఉన్నందున అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more