Chiranjeevi and Prakash Raj Condolences To Uttej ఉత్తేజ్ కు సతీవియోగం.. కంటతడి పెట్టిన చిరంజీవి, ప్రకాశ్ రాజ్

Actor writer uttej wife padmavathi passed away due to cancer

Actor Uttej, Uttej Wife, Uttej Wife Padmavathi, Uttej Wife no more, Uttej Wife passed away, Uttej Wife death, Uttej Wife died, Uttej Wife death news, Uttej Wife condolence, Cancer, Basavatarakam Hospital, Indo-cancer Hospital, Chiranajeevi, Prakash raj, Jeevitha. tollywood, movies, Entertainment

Tollywood actor Uttej’s wife Padmavathi passed away on Monday morning. She was diagnosed with cancer a few years ago. As her health deteriorated in the recent past, she was admitted to Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute. She died in the hospital while undergoing treatment.

ఉత్తేజ్ కు సతీవియోగం.. కంటతడి పెట్టిన చిరంజీవి, ప్రకాశ్ రాజ్

Posted: 09/13/2021 11:39 AM IST
Actor writer uttej wife padmavathi passed away due to cancer

సినీనటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి ఇవాళ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా క్యాన్సర్ తో బాధపడుతున్న అమె నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉత్తేజ్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు. ఉత్తేజ్ కు ఆయన భార్య అన్ని విధాలుగా అండగా ఉండేవారు. ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ను ఆమె నిర్వహించేవారు.

ఉత్తేజ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన 2017లో వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కాగా చిన్న కూతురు పాట ఉన్నత చదువులు చదువుతోంది. కాగా పద్మావతి మరణవార్త తెలిసిన వెంటనే అసుపత్రికి వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ఉత్తేజ్ ను పరామర్శించారు. మెగాస్టార్ ను చూడగానే ఉత్తేజ్ భోరున విలపించారు. తన జీవితభాగస్వామి తనను వదిలి వెళ్లిపోయిందని.. ఇక తాను ఒంటరినయ్యానని ఆయన చిన్నపిల్లాడిలా విలపించారు.

చిరంజీవి వస్తుండగానే ఆయన వద్దకు వెళ్లి కాళ్లపై వాళిపోయి ఏడుస్తున్న సన్నివేశం చూసి అక్కడ ఉన్న వారు కన్నీటి పర్యంతం అయ్యారు. ఉత్తేజ్ తో పాటు చేతన కూడా చిరంజీవిని పట్టుకుని విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఉత్తేజ్ నుతో పాటు ఆయన ఇద్దరి కూతుళ్లను కూడా చిరంజీవి ఓదార్చారు. చేతనను జీవిత రాజశేఖర్ ఓదార్చారు. ఈ ఘటనతో అసుపత్రిలో వున్నవారందరినీ కన్నీళ్లు పెట్టించింది. మెగాస్టార్ తో పాటుగా ప్రకాశ్ రాజ్, జీవిత, బ్రహ్మాజీ తదితరులు కూడా ఉత్తేజ్ ను పరామర్శించారు. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో పద్మావతి అంత్యక్రియలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles