Actor Raghubabu gets jandhyala excelency award జంధ్యాల జీవిత సాఫల్య అవార్డును అందుకున్న అలి

Telugu comedian ali recieves jandhyala life achievement award

comedian Ali, Ali, Ali Jandhyala Life achievement award, Director Jandhyala, Jandhyala Excellency award, Raghu babu, Director Nageshwar Rao, Pradeep, Naresh, Tollywood, movies, Entertainment

Telugu comedian Ali recieves jandhyala life achievement award, speaking on this occassion Ali remembers Director Jandyala would not only create charecters in his movie but also would see the pocket of his actors and staff.

జంధ్యాల జీవిత సాఫల్య అవార్డును అందుకున్న అలి

Posted: 07/21/2020 11:06 PM IST
Telugu comedian ali recieves jandhyala life achievement award

సుప్రసిద్ద హాస్య దర్శకుడు.. నవ్వలేని వాడు రోగిగా అభివర్ణించిన ఆయన నవ్వడం బోగం.. అంటూ తెలుగు ప్రేక్షకుల చేత నవ్వించి.. నవ్వించి.. నవ్వడంలో పాత్రలను అందుకు అనుగూణంగా పాత్రదారులను ఎంచుకోవడం ఆయకే చెల్లింది. దివంగత దర్శకుడు జంధ్యాల గురించి హాస్యనటుడు అలి మాట్లాడుతూ.. జంద్యాల గారు గుర్తు పెట్టుకుని పాత్రలను ఇవ్వడమే కాదని, ఆయన నటుల జేబులు చూసి డబ్బులు కూడా ఇచ్చేవారని.. గుర్తు చేసుకున్నారు. దర్శకుడు జంద్యాల జ్ఞాపకార్థం తాజాగా ‘జంధ్యాల హాస్యోత్సవం’ కార్యక్రమాన్ని ఆయన శిష్యులు ప్రదీప్, నరేష్, ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జూమ్‌ యాప్‌ ద్వారా ఎనిమిది దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంధ్యాల జీవిత సాఫల్య పురస్కారాన్ని హాస్య నటుడు అలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంధ్యాల తనకు చక్కని గుర్తింపును కల్పించారని, హస్య నటుడిగా చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునే పాత్రలను కల్పించి ఇచ్చారని అన్నారు. ఆయన గురించి చెప్పు విషయం ఒక్కటేనని, ఆయన తనకే కాదు ఆయన చిత్రాల్లో నటించే అనేక మంది నటుల జేబు చూసి డబ్బులు కూడా ఇచ్చేవారు. ఇవాళ ఆయన పేరు ఇచ్చిన జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చిరస్మరణీయమని అలి తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఆ తరువాత జంధ్యాల ఎక్సలెన్సీ అవార్డును నటుడు రఘుబాబు, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డిలకు ప్రదానం చేశారు. ఆ సందర్భంగా నటుడు రఘుబాబు మాట్లాడుతూ... ‘జంధ్యాలతో సినిమా చేయలేదని బాధగా ఉండేది. కానీ ఆయన పేరుమీద పురస్కారం రావడం నా అదృష్టం’ అని చెప్పారు. ఇది నాకు జీవితంలో మర్చిపోలేని రోజని దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు ప్రదీప్‌ సంధానకర్తగా వ్యవహరించారు. మురళీ మోహన్, అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles