బాలీవుడ్ నటి ప్రీతిజింతా, ఆమె మాజీ ప్రియుడు - ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్ వాడియా మధ్య విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే! ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నెస్ వాడియా తనపై చెయ్యి చేసుకున్నాడని, అందరిముందు దుర్భాషలాడుతూ తిట్టాడని ప్రీతిజింతా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది! దీంతో ఈ విషయంపై మీద పోలీసులు దర్యాప్తు చేయడం.. ఇంకా రకరకాల వివాదాలు బయటికి రావడం అన్నీ జరిగిపోయాయి కూడా! అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో వివాదం పెద్ద దుమారంగా మారిపోయింది.
ఈ కేసుకు సంబంధించి కొంతమంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన పోలీసులకు మరో కొత్త చిక్కు ఎదురయినట్టు కనిపిస్తోంది. నెస్ వాడియా తరఫున బిజినెస్ మేన్ సావన్ దారు అనే ఒక సాక్షి 2013 మే 30వ తేదీని జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి ఒక ఆసక్తికరమైన స్టేట్ మెంట్ ఇచ్చి, పోలీసులను ఇబ్బందుల్లో నెట్టేశాడు. ప్రీతిజింతా తనపై చెయ్యి చేసుకున్నాడని నెస్ వాడియాపై కేసు పెడితే.. ఆ సాక్షి (సావన్ దారు) మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ‘‘ఆనాడు ప్రీతిజింతాయే నెస్ వాడియా మీద దుర్భాషలాడటం మొదలుపెట్టిందని, అతను ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అందుకు వ్యతిరేకంగా కఠినంగా ప్రవర్తించిందని’’ అతను మెరైన్ డ్రైవ్ పోలీసులకు పేర్కొన్నట్టు ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆ సాక్షి వారిమధ్య జరిగిన వ్యవహారం గురించి వివరిస్తూ... ‘‘నెస్ వాడియా స్టేడియంకు చాలా ఆలస్యంగా వచ్చాడు. వచ్చిన వెంటనే తన అమ్మకోసం ఒక సీటు వెదికాడు. అనంతరం ప్రీతిజింతా దగ్గరకు వచ్చి తనతో కొంతవరకు సంభాషణలు జరిపాడు. అనంతరం వారిమధ్య జరిగిన సంభాషణలు నాకు వినిపించలేదు కానీ నెస్ వాడియా అక్కడి నుంచి వెళిపోతుండగా.. ప్రీతిజింతా అతని మీద దుర్భాషలాడుతూ బిగ్గరగా అరిచింది’’ అని సావన్ దారు చెప్పినట్టు ఒక పోలీసు అధికారి పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. మరికొంతమంది సాక్షులు కూడా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల గురించి తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డానిష్ మర్చెంట్, జయ్ కనొజియా, పారుల్ ఖన్నా తదితర సాక్షులు.. ‘‘ప్రీతి జింతాను నెస్ వాడియా మధ్య వాదన జరుగుతున్న నేపథ్యంలో వాడియా తన చెత్తో ప్రీతిని ముందుకు నెట్టినట్టు’’ వారు పేర్కొన్నారు. అయితే క్యాస్టెల్లినో మాత్రం వారి మధ్య ఎటువంటి వాగ్యుద్ధం జరగలేదని, వాడియా తనను కొట్టినట్టు చూడలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెస్ వాడియా తన దగ్గరున్న మరికొంతమంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాల్సిందిగా పోలీసులను కోరాడు.
వాడియా విజ్ఞప్తి ప్రకారం అతని తరఫున వచ్చిన మరికొంతమంది సాక్షులను కూడా పోలీసులు పరిశీలించారు. అందులో ఫరా ఊమర్ భోయ్ అనే ఒక లేడీ తన స్టేట్ మెంట్ లో.. ‘‘వారి మధ్య ఎటువంటి వాగ్యుద్ధం జరగలేదని, వారు మ్యాచ్ ను చూస్తూ సరదాగా కాలం గడిపారు. అంతేకాదు.. నెస్ వాడియా ప్రీతిని నెట్టినట్టు నేను చూడలేదు కూడా!’’ అని పేర్కొంది. ఇలా ఈవిధంగా ఒక్కొక్క సాక్షి ఒక్కొక్క రకంగా తమ వాంగ్మూలాలను వినిపించిన అనంతరం.. పోలీసులు మరిన్ని చిక్కుముడుల్లో పడిపోయారని తాజా సమాచారం!
ప్రీతి, నెస్ వాడియాలు బ్రేక్ అప్ అయిన తరువాత కూడా వీరిద్దరూ తమ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఓనర్ర గా వ్యవహరించేవారని కొంతమంది ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు. 2013 మే 30వ తేదీన వాంఖడే స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో వీరిద్దరి మధ్య కొద్దిసేపటి వరకు దొబ్బులాట జరిగింది. అందులో నెస్ వాడియా తనను కొట్టాడని, దుర్భాషలాడాడని ప్రీతి జూన్ నెలలో వాడియా మీద కేసు నమోదు చేసింది.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more