తెలుగు చిత్ర సీమలో ఒకప్పుడు ప్రబలంగా ఉండిన ఇగోలకు ఇప్పడు కాలం చెల్లింది. దీనిని అగ్రహీరో మహేష్ తాజాగా రుజువుచేస్తే అదే బాటలో పవన్ వంటి స్టార్ హీరోలు నడిచేందుకు మగ్గుచూపుతున్నారు. బన్నీ-మంచు విష్ణు వంటి కుర్రహీరోలు ఇప్పటికే కలిసినటించి చిత్ర సీమలో ఆరోగ్యకర వాతావరణానికి నాంధి పలికారు. ఈ క్రమంలో మల్టీ స్టారర్ సినిమాలకు మెల్లగా అలవాటవుతున్న మిగతా తెలుగు హీరోల పుణ్యమాని వివిధ అదిరిపోయే కాంబినేషన్స్ కు తెరలేపుతున్నారు.
ఇక ప్రస్తుతాంశం ఏంటంటే.. దర్శకుడిగా సుకుమార్ అరంగేట్రంలో అల్లు అర్జున్ రెండో సినిమాగా వచ్చిన 'ఆర్య' అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఎంతటి సంచలనమో తెలిసిందే. ఈ సినిమాలో బన్నీతో కలిసి శివబాలాజీ నటించాడు. అనంతరం వచ్చిన 'ఆర్య-2' లో హీరోను ద్వేషించే స్నేహితుడి పాత్రలో నవదీప్ నటించాడు. తెలుగు తెరపై భిన్నమైన చిత్రాలుగా సుకుమార్ ఈ రెండింటినీ మలచాడు. అయినాకానీ, ఈ కాన్సెప్ట్ మీద మోజు తీరని సుకుమార్ ఇప్పుడు మూడో ఆర్యకు రంగం సిద్ధం చేస్తున్నాడు.
ఈ సినిమాలో బన్నీతో కలిసి అక్కినేని వారసుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్ ద్వారా నాగ చైతన్యకు మంచి హిట్ వచ్చిన నేపథ్యంలో చైతు ఈ ప్రాజక్ట్ కు వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. బన్నీకూడా ఈ ప్రాజక్టుకు సుముఖంగా ఉన్నమీదట ఆర్య వాల్యూమ్ 3 త్వరలోనే సాక్షాత్కారం కాబోతోందన్నమాట.
అర్జున్ సరసన సమంతాను ఎంపిక చేశారని తెలుగువిశేష్ కు అందిన విశ్వసనీయ సమాచారం. గత రెండు పార్ట్ లకు అదిరిపోయే సంగీతాన్నిచ్చిన దేవిశ్రీప్రసాద్ ను కాకుండా 3వ భాగానికి హేరిస్ జైరాజ్ మ్యూజిక్ ఇస్తాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారి ప్రకటన వెలువడటమే తరువాయి.
ఇదిలా ఉండగా బన్నీ తాజా సినిమా 'ఇద్దరమ్మాయిలతో' షూటింగ్ రేపటినుంచి (8వతేదీ) స్పెయిన్ లో జరగబోతోంది. ఇందుకోసం నాలుగురోజుల ముందుగానే దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పెయిన్ వెళ్లారు. ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగు ఇటీవల బ్యాంకాక్ లో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. అక్కడ యాక్షన్ దృశ్యాలను, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అల్లు అర్జున్ సరసన అమలాపాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు.
కాగా, నాగచైతన్య ప్రస్తుతం దేవ కట్టా దర్శకత్వంలో ఆటోనగర్ సూర్య చిత్రాన్ని చేస్తున్నసంగతి తెలిసిందే. మరోవైపు ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ సినిమా 'చార్మినార్' తెలుగు రీమేక్ లో నాగచైతన్య హీరోగా నటించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాత శ్రీధర్. ఇక హలో బ్రదర్ సినిమాకి రీమేక్ అని చెప్పుకొస్తోన్న సినిమాలో చైతు ద్విపాత్రాభినం చేయబోతున్నాడు. ఈ సినిమాకి ఢమరుకం దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు
అయితే ఈ రెండు ప్రాజక్ట్ ల కంటే ముందుగానే అల్లు అర్జున్ తో మల్టీస్టారర్ తెరకెక్కనుందని తెలుస్తోంది. వరుస చిత్రాలతో చైతన్య ఈ ఏడాది యమ బిజీ కాబోతున్నాడన్నమాట.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more