సాధారణంగా పర్సనల్ ఇంటర్వూల్లో కానీ, పబ్లిక్ ఫంక్షన్స్ లో స్పీచ్ ఇచ్చేటప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున చాలా కాజువల్ గా మాట్లాడేస్తుంటారు. ఆయన మాటలు ఎక్కడా తొణకవు బెణకవు. అయితే అందుకు పూర్తి విరుద్దంగా సాగింది ఆయన మాటల ప్రవాహం. దీనికి వేదిక ఆయన నటించిన ‘డమరుకం’ ఆడియో విడుదల కార్యక్రమం. ఈ వేడుక లో కింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. "నా కెరీర్లో నేను మూడుసార్లు పడి లేచాను. గెలుపు, ఓటములనేవి ఎవరికైనా వుంటాయి. అయితే, నా అభిమానులు మాత్రం ఎప్పుడూ నన్ను వెన్నంటి ఉంటూ, ప్రోత్సహిస్తూ వచ్చారు. నేను ఎటువంటి ప్రయోగం చేసినా నన్ను ఆదరించారు. గత పాతికేళ్ల నుంచీ అభిమానులు అలా తమ అభిమానాన్ని నా మీద కురిపిస్తూనే వున్నారు. అందుకే నా అభిమానుల్ని చూసి ఎప్పుడూ గర్వపడుతుంటాను" అని కన్నీరు పెట్టారు నాగార్జున.
అంతేకాదు తన దృష్టిలో చిన్న దర్శకులు, పెద్ద దర్శకులు అనే తేడా ఉండదని అక్కినేని నాగార్జున చెప్పారు. ప్రతిభ వుంటే చాలనుకుంటానని ఆయన అన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారిలో చిన్న దర్శకులు చాలామంది వున్నారని నాగార్జున అభిప్రాయపడ్డారు. అందుకే, తాను మొదటి నుంచీ ప్రతిభ వున్న వారందరికీ అవకాశాలు ఇచ్చానని ఆయన అన్నారు.
నిన్న రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో వేడుకగా జరిగిన 'డమరుకం' చిత్రం ఆడియో వేడుకలో ఆయన ఆ విధంగా స్పందించారు. పాటల సీడీలను ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఇది సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన 50 వ చిత్రం కావడంతో, ఆయన చేత ప్రత్యేకమైన కేక్ ను కట్ చేయించారు. ప్రతిగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ "నేను చేసిన తొలి చిత్రం 'దేవి' భక్తిరస చిత్రం కావడం, మళ్లీ 50 వ సినిమా 'డమరుకం' కూడా అలాంటిదే కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇళయరాజా చేసే లాలిపాటలంటే ఎంతో ఇష్టం. అలాంటి పాట ఒకటి చేయాలని వుండేది. ఇందులో అలాంటి పాట చేసే అవకాశం వచ్చింది" అన్నారు.
ఇంకా రాజమౌళి, వీవీ వినాయక్, యస్వీ కృష్ణారెడ్డి, చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రంలోని 'సక్కూభాయ్ గరం చాయ్...' పాటను ఈ వేదికపై గాయని మమతా శర్మ పాడగా, కథానాయిక చార్మీ డ్యాన్స్ చేసి, అందర్నీ ఆకట్టుకుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more