ఓలా స్కూటర్ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా తాజాగా ఆ సంస్థ సీఈవో భవిశ్ అగర్వాల్ ఓలా ఈవీ బైక్ వాహనప్రియులకు శుభవార్త చెప్పారు. ఒలా ఈవీ బైక్ లవర్స్ గత ఆరు నెలలుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్కి సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్ఓఎస్2 అప్డేట్ అన్లాక్ అవుతుందని తెలిపారు.
ఓలా స్కూటర్ ప్రీ పొడక్షన్లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్తో స్కూటర్ డెలివరీ ఒత్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి.
అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్లో లాక్మోడ్లోనే ఉండిపోయాయి. డిజిటల్ కీ, మూవ్ఓస్ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్ను అన్లాక్ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్ అగర్వాల్ త్వరలోనే మూవ్ఓస్ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ డిజటల్ కన్సోల్లో నావిగేషన్ మ్యాప్ అందుబాటులోకి రానుంది.
Taking the wife out for some ice cream! Navigation on MoveOS 2 working great
(And get your daily news straight to your inbox)
Jan 18 | దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును తీర్చిద్దేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం... Read more
Nov 13 | ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8... Read more
Nov 13 | ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి యూనిట్ ప్రారంభమైన... Read more
Nov 11 | వారాంతంలో స్టాక్ మార్కెట్ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్ మూలధనం (ఎం-క్యాప్) కోల్పోయాయి. గత వారంలో... Read more
Nov 11 | ఈ ఏడాది భారత స్టాక్ మార్కె ట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్ డాలర్లు)... Read more