ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ (ఐఐఎఫ్ఎసి)కి రాష్ట్రంలోని ఆరు ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని ఆ సంస్థ సిఎండి డాక్టర్ హర్ష్ కుమార్ భన్వాలా చెప్పారు. ఇప్పటికే 8 ప్రాజెక్టులకు రూ.18,674 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు వెయ్యి కోట్ల రుణం కోరుతూ ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని అధ్యయనం చేస్తున్నామని ఆయన చెప్పారు.
తమ సంస్థ 700 మిలియన్ డాలర్ల రుణాన్ని విదేశీ సంస్థల నుంచి తీసుకుంటుందని చెప్పారు. బ్యాంకుల కన్నా ఆ సంస్థ ఇచ్చే రుణాలపై వడ్డీ తక్కువ శాతం ఉంటుందని, దీంతో భారీ సంస్థలు, కంపెనీలు తమవైపే మొగ్గు చూపుతున్నాయని ఆయన అన్నారు. తమ సంస్థ కన్సార్టియం కంపెనీలకు ఎక్కవ రుణాలిస్తుందని, ఇందులో ఎక్కువగా దీర్ఘకాలిక రుణాలే ఉంటాయని ఆయన చెప్పారు. సంస్థలకు నేరుగా రుణాలిస్తామని, అలాగే బ్యాంకుల ద్వారా రీఫైనాన్స్ చేస్తామని ఆయన వివరించారు.
ఢిల్లీ -ముంబయి పారిశ్రామిక కారిడార్లో నెలకొల్పే ప్రాజెక్టులకు రుణాలిస్తున్నామని హర్షకుమార్ వివరించారు. తమ సంస్థ 2012- 13 నాటికి రూ.40,670 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రుణాలపై తమ సంస్థ రూ.1,009 కోట్ల లాభం ఆర్జించి కేంద్ర ప్రభుత్వానికి రూ.221 కోట్లు డివిడెండ్ చెల్లించిందని హర్ష్కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ సంస్థ క్రెడిట్ పోర్ట్పోలియో రూ. 50,000 కోట్లకు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థ ఇచ్చిన రుణాల్లో 45 శాతం రోడ్ల నిర్మాణాలు, 40 శాతం ఇంధన ప్రాజెక్టులు, మిగిలిన 15 శాతం రుణాలు పోర్టులు, ఎయిర్పోర్టు తదితర రంగాలకు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Apr 19 | ఓలా స్కూటర్ యూజర్లకు ఇటీవలే షాకిచ్చిన సంస్థ తాజాగా శుభవార్తను చెప్పింది. నెల రోజుల క్రితం ఓలా ఈవీ బైక్ ఎస్-1 ధరలను పెంచనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈవీ వాహనదారులు ఖంగుతిన్నారు. కాగా... Read more
Jan 18 | దేశంలోనే అధిక లాభాలు ఆర్జంచే బ్యాంకుగా ఆంధ్రాభ్యాంకును తీర్చిద్దేందుకు సంబంధిత అధికారుల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం వచ్చే మార్చి మాసాంతానికల్లా దేశ వ్యాప్తంగా నూతనంగా మరో 212 బ్యాంకు శాఖలను, 800 ఎటిఎం... Read more
Nov 13 | ఒడిశాలోని జిఎంఆర్ కమలాంగ థర్మల్ విద్యుత్ ప్లాంట్ (జికెఇఎల్)లో 350 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్ వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించిందని జిఎంఆర్ గ్రూప్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో తొలి యూనిట్ ప్రారంభమైన... Read more
Nov 11 | వారాంతంలో స్టాక్ మార్కెట్ బలహీనపడిన నేపథ్యంలో తొమ్మిది అగ్రశ్రేణి కంపెనీలు భారీ నష్టాలు చవి చూశాయి. రిలయన్స్, ఓఎన్జీసీ వంటి చమురు దిగ్గజాలు రూ.58,987 కోట్ల మార్కెట్ మూలధనం (ఎం-క్యాప్) కోల్పోయాయి. గత వారంలో... Read more
Nov 11 | ఈ ఏడాది భారత స్టాక్ మార్కె ట్లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలాగా ప్రవహిం చాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అందించిన సమాచారం ప్రకారం 2013లో ఇప్పటివరకు రూ. 91,892 కోట్ల (16.67 బిలియన్ డాలర్లు)... Read more