చర్మసౌందర్యాన్నీ మెరుగుపరుచుకోవడానికి ఏ బ్యూటీపార్లర్లకో వెళ్లడంగానీ, వివిధ రకాల క్రీములు ముఖానికి పూసుకోవడం వంటి చర్యలు చేయాల్సిన అవసరం లేదు. మనకు ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాలలో వుండే పోషకపదార్థాలు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడమేగాకుండా... ముడతలు పడకుండా నిత్యం యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతాయి. నిపుణులు నిర్వహించిన కొన్ని అధ్యయనాల ప్రకారం... క్రీములు వాడటంకంటే ప్రకృతిలో లభించే పదార్థాలే చర్మానికి ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. కాబట్టి క్రీములు వాడకాన్ని ఎంతవరకు తగ్గిస్తే అంతవరకు మంచిది. ఇక సౌందర్యం విషయానికి వస్తే.. ప్రకృతిలో లభించే పదార్థాలతోపాటు మన ఇంట్లోనే సహజసిద్ధంగా లభించే శెనగపిండితో కూడా రకరకాల చర్మ సమస్యల్ని తగ్గించుకోవడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
శెనగపిండితో కలిగే చర్మసౌందర్య ప్రయోజనాలు :
1. మొటిమల నివారణ : కాస్త శెనిగిపిండిని చందనం పేస్ట్ లో బాగా కలుపుకొని.. మొటిమలపై రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే.. చాలా త్వరితంగా మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ మిశ్రమంలో నిమ్మరసం కూడా కలుపుకుంటే.. ముఖంమీద వుండే మచ్చలు కూడా తొలగిపోతాయి.
2. ముడతలు మాయం : వయసు పైబడుతున్న కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడటం సర్వసాధారణం. అలాగే మొటిమల ద్వారా ముఖంపై నల్లని మచ్చలు, కంటికింద నల్లని ఛాయలు ఏర్పడటం సహజమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే శెనిగిపిండితో ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. మొదట ఆరు బాదం పప్పులను కొన్ని పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ బాదం, పాలను మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త శెనగపిండి, కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేసుకుంటే చాలా త్వరగా ఫలితం పొందుతారు.
3. బిగుతైన చర్మం కోసం : ఒక కోడిగుడ్డలోని తెల్లసొనని తీసుకుని దానిని బాగా కలపాలి. అందులో రెండు చెంచాల శెనగపిండి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి వేసుకున్న అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం బిగుతుగా, చాలా మృదువుగా వుంటుంది.
4. అవాంఛిత రోమాలను తగ్గించుకోవడం : సాధారణంగా కొంతమందికి అవాంఛిత రోమాలు ఎక్కువగా పెరుగుతుంటాయి. ఇవి సౌందర్యాన్ని పూర్తిగా మార్చేయడమే కాకుండా చూడ్డానికి చాలా అసహ్యంగా అనిపిస్తాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే.. శెనగపిండిలో కొద్దిగా నీళ్లుపోసి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిని మొత్తం శరీరానికి పట్టించి కాసేపటి తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది.
5. ట్యాన్ (చర్మం లేత గోధుమరంగులోకి మారడం) తగ్గించుకోవడం : కొద్దిగా శెనగపిండి తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొంచెం పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. ట్యాన్ సమస్య తగ్గడంతోపాటు మృదువైన చర్మాన్ని పొందవచ్చు.
6. జిడ్డు చర్మం నుంచి విముక్తి : కొంతమంది చర్మం చాలా జిడ్డుగా వుంటుంది. ముఖం కడుక్కున్నా కొద్దిసేపటి తర్వాత మళ్లీ జిడ్డుగా తయారౌతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు.. నాలుగు చెంచాల శెనగపిండిలో ఒక చెంచా రోజ్ వాటర్, రెండు చెంచాల తేనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూసుకోవాలి. బాగా ఆరిపోయేవరకు వుంచుకున్న అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
7. పొడిచర్మం నుంచి విముక్తి : కాస్త శెనగపిండిలో కొంచెం మీగడ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు రాసుకుని కాసేపటి తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఆలివ్ నూనె, బాదం నూనెను కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.
8. శుభ్రమైన చర్మం కోసం : కాస్త శెనగపిండిని తీసుకుని అందులో కొద్దిగా పచ్చిపాలు లేదా పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా ప్రతీరోజూ చేసుకుంటే.. ముఖం కాంతివంతగా మెరవడంతోపాటు చాలా శుభ్రంగా అనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more