సూపర్’స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘లింగ’ ఆడియో వేడుకను హైదరాబాద్’లో ఘనంగా నిర్వహించారు. నిజానికి ఈ మూవీ ఆడియో వేడుకను తమిళంలో విడుదల చేసినప్పుడే తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే.. ప్రస్తుతం ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రమోషన్’లో భాగంగా మరోసారి తెలుగులో విడుదల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో రజనీ, దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత రాక్’లైన్ వెంకటేశ్, అనుష్క, సోనాక్షీ, చిత్ర కెమెరామెన్ రత్నవేల్, ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్, నిర్మాత అల్లుఅరవింద్, దర్శకుడు త్రివిక్రమ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఆడియో వేడుకను సందర్శించడానికి రజనీ అభిమానులు ఎంతోమంది హాజరయ్యారు. చిత్రానికి సంబంధించి విషయాల గురించి ఆ మూవీ యూనిట్ బృందాలు తమ ప్రసంగాల ద్వారా వెల్లడించారు.
రజనీకాంత్ బర్త్’డే సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ మూవీలో అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్’తో నిర్మించిన ఈ మూవీ హక్కుల్ని ఈరోస్ సంస్థ అప్పుడే దాదాపు 165 కోట్లకుపైగా వ్యయాన్ని చెల్లించి కొనుక్కుందని సమాచారం!
ఇక ఈ సినిమా విడుదల కోసం రజనీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ‘కొచ్చాడయాన్’లాంటి మోషన్ పిక్చర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తాపడిన నేపథ్యంలో ఈ లింగ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. విడుదలకు ముందే భారీ లాభాలను మూటగట్టుకున్న ఈ సినిమా.. రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు బద్దలవ్వడం ఖాయమని దర్శకనిర్మాతలతోబాటు అభిమానులు ఆశిస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more