Ktr puts late comers on notice says indiscipline won t be tolerated

K.Taraka Rama Rao, Secretariat employees, Scheduling, late-comers, Indiscipline, tolerate, Surprise check, subordinates, Section Officers

KTR puts late-comers on notice, says Indiscipline won’t be tolerated

క్రమశిక్షణ లేకుంటే సహించలేం..

Posted: 11/01/2014 04:38 PM IST
Ktr puts late comers on notice says indiscipline won t be tolerated

అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు హెచ్చరించారు. ఉదయం 10.50 గంటలకు ఆయన ఆకస్మికంగా సచివాలయంలో తనిఖీలు నిర్వహించారు. వచ్చీరాగానే తన పంచాయతీరాజ్ విభాగానికి వెళ్లి చూశారు. దాదాపు అన్ని సెక్షన్లలో ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపించాయి. 21 మంది అధికారుల్లో కేవలం నలుగురే విధులకు హాజరయ్యారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ విభాగపు కమిషనర్ కూడా ఆలస్యంగానే వచ్చారని తప్పుపట్టారు. అంతలో మంత్రి వచ్చిన సమాచారం తెలియడంతో ఉద్యోగులు హడావుడిగా కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేశారు. తొలి తనిఖీ కావడంతో ఉదారంగా వ్యవహరిస్తున్నామని.. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవటం సరికాదని కేటీఆర్ చెప్పారు.

‘పరిపాలనకు సచివాలయం గుండెకాయ లాంటిది. ఇక్కడే సమయపాలన పాటించకపోతే   క్షేత్రస్థాయి వరకు అటువంటి సంకేతాలే వెళ్తాయి. కొత్త రాష్ట్రంపై ప్రజలకు కోటి ఆశలున్నాయి’ అని అన్నారు. సెక్షన్ క్లర్కు నుంచి కమిషనర్.. ముఖ్య కార్యదర్శి వరకు ఎవరైనా సరే సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని.. టైమ్‌కు రాని ఉద్యోగులపై చర్యలుంటాయని.. గైర్హాజరు అయినట్లు పరిగణిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల హాజరుకు సంబంధించి బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేసే విషయంపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం జరగాల్సి ఉంటుందని.. అలాంటి ఆలోచన ఉంటే ముందుగా ఐటీ విభాగంలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more