అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు దిగిరానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 27 నెలల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో డీజిల్పై రూ. 2.50, పెట్రోల్పై రూ. 1 తగ్గే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 15న మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ తగ్గింపు అమలులోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ నెల రెండు పర్యాయాలు పెట్రోల్ ధరలను సమీక్షించే చమురు సంస్థలు.. ఈ నెల 15న భేటీ కానున్నాయి. ప్రస్తుతం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 1.35 డాలర్లు తగ్గి 90.76 డాలర్లకు చేరింది. 2012 జూన్ తర్వాత ధరలు ఈ స్థాయికి దిగి రావడం ఇదే తొలిసారి.
మొత్తంగా ఈ ఏడాదిలో ముడిచమురు ధరలు 18 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 16 నాటికే డీజిల్ ధరలు తగ్గడంతో చమురు కంపెనీలకు లీటరుకు 35 పైసలు లాభం వచ్చింది. ఇది అక్టోబర్ 1 నాటికి రూ. 1.90 పైసలకు పెరిగింది. ఇప్పుడు లాభం రూ. 2.50 చేరిందని భావిస్తున్నారు. సెప్టెంబర్లోనే డీజిల్ ధర తగ్గించాలని ప్రభుత్వం భావించినా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందు వల్ల ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా డీజిల్ ధరను ఇటీవల తగ్గించని కారణంగా. ఈ పర్యాయం డీజిల్ ధరను రెండు నుంచి మూడు రూపాయల మేర తగ్గే అవకాశాలున్నాయి
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more