My assets are for tamil nadu people

ADMK; Jayalaliyha; ADMK Chief; AnnaDMK; Former Chief Minister Jayalalithaa; ACB officers enquiry Lawyers

Tamil nadu people are my assets and viceversa says jayalalithaa

తమిళనాడు ప్రజలే నా ఆస్తి, వారికే నా ఆస్తి..

Posted: 10/02/2014 01:49 PM IST
My assets are for tamil nadu people

తమిళనాడు ప్రజలే నా ఆస్తి, నా ఆస్తి అంతా వారికే’.. స్వతహాగా సొంత కుటుంబమే లేని నాకు కోట్లాది రూపాయల అక్రమార్జన అవసరమేమిటని అమె న్యాయమూర్తిని ప్రశ్నించిందట. ఎవరామె, ఏమా కథా అనుకుంటున్నారా..? ామె మరెవరో కాదు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. బెంగళూరు కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే న్యాయమూర్తి సమక్షంలో జయలలిత ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ ప్రముఖ తమిళ పత్రికలో కథనం ప్రచురితమైంది.

జయ తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాను పొందిన చివరి రోజుల్లో (1991-96) ఐదు కోట్ల రూపాయల వ్యయంతో తన పెంపుడు కొడుకు సుధాకరన్ వివాహాన్ని జరిపించింది. దీంతో పాటు భారీగా అక్రమార్జన చేసినట్లు జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిటిషన్‌పై ఏసీబీ అధికారులు విచారణ జరిపి రూ.66.44 కోట్లు అక్రమార్జనగా లెక్కతేల్చి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 18 ఏళ్లపాటు సాగిన ఈ కేసుపై గత నెల 27వ తేదీన తీర్పు వెలువడింది.

సీఎం హోదాను అడ్డం పెట్టుకుని ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు రుజువైందని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అక్రమాస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, అరేళ్ల పాటు ప్రజా ప్రతినిధుల చట్టం మేరకు అనర్హత వేటు విధించింది. ఈ నాలుగు రోజుల్లో జయను జైల్లో కొందరు ముఖ్యులు కలుసుకున్నారు. వీరి ద్వారా సేకరించిన సమాచారాన్ని కథనంగా ఓ తమిళ దినపత్రిక ప్రచురించింది. తాను స్వతహాగా ఆస్తిపరురాలిని, సినీ నటిగా కూడా ఎంతో సంపాదించాను. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే తనకు మంచి ఆస్తి ఉందని కోర్టులో న్యాయమూర్తికి వివరించిందిట. తనకంటూ ఓ కుటుంబమే లేనప్పుడు అక్రమంగా ఆర్జించాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తినే ప్రశ్నించిందట. తనకున్న ఆస్తి అంతా తమిళనాడు ప్రజలేనని,. అందుకే తన ఆస్తినంతా తమిళనాడు ప్రజలకే అంకితం చేస్తానని చెప్పిందట. ప్రజాకోర్టులో తనన్ను ఢీకొనలేని కొందరు వ్యక్తులు కుట్రపన్ని తనను న్యాయస్థానానికి రప్పించారని, అక్రమ కేసులను బనాయించి ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ తీర్పువెలువడిన అనంతరం న్యాయమూర్తికి జయ విన్నవించుకున్నట్లు తమిళ పత్రిక కథనంలో పేర్కొంది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more