తెలంగాణలో నివసించే ప్రతీ ఒక్కరి జాతకాలు కంప్యూటర్లలో నిక్షిప్తమైవున్నాయి. తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే సమాచారానికి సంబంధించి అధికారులు కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలు, 3.61 కోట్ల జనాభా ఉన్నట్లు అధికారులు నిర్ధారణ అయింది. గత నెల 19న ఒక్క రోజులోనే చేపట్టి పూర్తిచేసిన ఈ సర్వేలో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. కోటికిపైగా కుటుంబాల సర్వే సమాచారాన్ని రికార్డు స్థాయిలో నెలరోజుల్లోనే అధికారులు కంప్యూటరీకరణ చేయగలిగారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సమాచారాన్ని అధికారులు క్రోడీకరించారు.
సర్వేలో సేకరించిన తాజా సమాచారంతో సంక్షేమ పథకాలను అర్హులకే దక్కేలా కార్యాచరణ రూపొందించనున్నారు. సర్వే సమాచారంతో ప్రభుత్వ పథకాల రూపకల్పన, అమలు జరగనుంది. పింఛన్లు, ఇళ్లు, వంటి వ్యక్తిగత ప్రయోజనాల కల్పనకు సర్వే సమాచారం కీలకం కానుంది. సుమారు 22 అంశాలతో సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన శాఖలు వినియోగించుకునేలా చేస్తారు. మరోవంక ఈ సర్వే వివరాలను కొన్ని గ్రామాల్లో సరిచూడనున్నారు. సంబంధిత శాఖలకు ఈ సర్వే సమాచారం ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. అవి సంక్షేమ పథకాలను అమలు చేసేటపుడు లబ్ధిదారులకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని ప్రత్యేకంగా సేకరించుకుంటాయి.
సర్వేతో తెలంగాణలో జిల్లాలవారీగా కూడా ప్రభుత్వం సమాచారం క్రోడీకరించింది. కుటుంబాల సంఖ్య, జనాభా పరంగా హైదరాబాద్ ముందుంది. జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా 73.07 లక్షలు కాగా, మహబూబ్నగర్ జిల్లాలో కుటుంబాల సంఖ్య తక్కువ, జనాభాలో ఇతర అన్ని జిల్లాలకంటే ముందుంది. ఈ జిల్లాలో 42.14 లక్షల జనాభా ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ తర్వాత అత్యధికంగా కరీంనగర్ లో 12.35 లక్షల కుటుంబాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో కుటుంబాల సంఖ్య వరంగల్ జిల్లా కంటే ఎక్కువగా ఉన్నా.. జనాభా మాత్రం వరంగల్ కంటే తక్కువగా ఉంది. అన్నింటా నిజామాబాద్ జిల్లా కుటుంబాల సంఖ్యలో, జనాభాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో చివరి స్థానంలో ఉంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more