Husband killed his wife for talking on mobile phone continuously in bangalore

husband killed wife, woman talkin mobile, woman using mobile, husband killed wife with knife, husband wife fight, differencese between husband wife, husband killed wife for using mobile

husband killed his wife for talking on mobile phone continuously in bangalore

శ్రుతిమించిన ‘ఫోన్’ సంభాషణలతో ప్రాణాలు పొగొట్టుకుంది!

Posted: 09/09/2014 10:38 AM IST
Husband killed his wife for talking on mobile phone continuously in bangalore

(Image source from: husband killed his wife for talking on mobile phone continuously in bangalore)

ప్రస్తుతకాలంలో సెల్ ఫోన్ వాడకం ఏ విధంగా వుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడుపూట్ల భోజనం లేకపోయినా యువకులు వుండగలరేమోగానీ.. చేతిలో సెల్ ఫోన్ లేకపోతే మాత్రం ఒక్క క్షణం కూడా వుండలేరు. చాటింగ్, సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్, తరుచూ సంభాషణలు చేసుకోవడం ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానానికి అలవాటు పడిపోయి వుంటారు. అయితే అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే దానిని వినియోగించుకోవాలి కానీ.. శ్రుతిమించితే మాత్రం ఎంతటి అనర్ధానికైనా దారితీస్తాయనడానికి ఇదొక ఉదాహరణ!

అందరిలానే ఓ వివాహిత తరుచూ సెల్ ఫోన్ లో గంటలతరబడి మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంది. ఎంతగా అంటే.. ఏకంగా అది ఆమె ప్రాణాలనే తీసేసింది. తీరిక సమయం లేకుండా నిత్యం మాట్లాడుటం వ్యసనంగా మార్చుకున్న సదరు వివాహితురాలు.. అదే ఆమెపాలిట శాపంగా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఇరుగుపొరుగు ఇళ్లల్లో వుండే సైమన్, రేణుకా ఇద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. అనంతరం వారిద్దరూ బెంగుళూరు రాజగోపాలనగరలోని సంజీవని నగరలో నివాసం వుంటున్నారు. ఇక్కడే సైమన్ ఓ ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు. కొన్నాళ్లపాటు జీవితం బాగానే కొనసాగింది.

ఇదిలావుండగా.. రేణుకా కాలక్రమంలో నిత్యం మొబైల్లో మాట్లాడటం వ్యసనంగా మార్చుకుంది. ఎప్పుడు చూసినా గంటలతరబడి మాట్లాడుతూనే వుండేది. తన భర్త ఇంటికి వచ్చినవేళ భోజనసమయంలో కూడా ఫోన్ ను వదలకుండా మాట్లాడుతూనే వుండేది. దీంతో భర్త సైమన్ ఆమెను హెచ్చరించేవాడు. రేణుకా ఎవరితో మాట్లాడేదో కూడా సరిగ్గా చెప్పేది కాదు. భర్త ఎన్నిసార్లు అడిగినప్పటికీ.. ఆమె మాత్రం పూర్తి వివరాలు తెలియపర్చకుండా తన పని తాను చేసుకుపోయేది. ఇలా వీరిమధ్య అప్పుడప్పుడు గొడవలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఆదివారం రాత్రి గొడవ జరిగింది. భార్య తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయిన భర్త.. కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.

సోమవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని పరిశీలించిన అనంతరం.. మృతదేమాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే భర్త కనిపించకపోవడంతో అనుమానం కలిగిన వారికి అతనికోసం వేటను మొదలుపెట్టారు. ఈక్రమంలోనే బంధువు ఇంట్లో తలదాచుకున్న సైమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించి, దర్యాప్తును చేపట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : husband killed wife  woman mobile phone  bangalore crime news  husband wife fight  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more