Central minister sadananda gowda son karthik booked in rape case

narendra modi, central ministers, bjp central ministers, sadananda gowda, sadananda gowda son karthik, sadananda gowda son karthik engagement

central minister sadananda gowda son karthik booked in rape case. An actress files a complaint against him and giving statement that they are already married

రేప్ కేసులో కేంద్రమంత్రి కొడుకు.. డేంజర్ లో మోడీ ప్రభుత్వం!

Posted: 08/28/2014 03:29 PM IST
Central minister sadananda gowda son karthik booked in rape case

బీజేపీ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులపై ఈమధ్య ఆరోపణలు తీవ్రస్థాయిలో వెలువడుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మూడునెలలైనా పూర్తి కాలేదు కానీ... అప్పుడే వారిమీద అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలు, అవినీతి, అత్యాచారాలు వంటి నేరాలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. నిన్నటికినిన్నే కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కుమారుడు అవినీతికి పాల్పడుతున్నాడంటూ.. ఆయన కుటుంబం అవినీతితో కూరుకుపోయిందంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా మరో కేంద్రమంత్రి సదానందగౌడ కుటుంబంపై అదే స్థాయిలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆ పార్టీ పెద్ద డైలమాలో మునిగిపోయింది.

కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. బుధవారం కార్తీక్ వివాహ నిశ్చితార్థం జరగగా.. ఒక నటి అతనిపై ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందని సిటీ పోలీస్ కమిషనర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తనను అత్యాచారం చేసి వదిలేశాడని ఆ నటి నేరారోపణలు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా ఫిర్యాదు చేసిన సదరు నటి కూడా ఒక టెలివిజన్ ఛానెల్ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. కార్తీక్ తనను ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడని.. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడని ప్రశ్నించింది. దీంతో ఈ విషయం తారాస్థాయికి చేరిపోయింది. ఇక ప్రత్యర్థ నాయకులు అయితే ఇదే మంచి అవకాశమనుకుని బీజేపీ పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించేశారు.

అయితే తమపై వస్తున్న ఈ అత్యాచార ఆరోపణలను సదానందగౌడ ఖండించారు. తన కుమారుడు అటువంటి అశ్లీల పనులు చేయడని.. ఒకవేళ నాకొడుకు ఆ తప్పు చేసినట్లు రుజువైతే శిక్షించమని పేర్కొన్నారు. అలాగే తనపై నమోదైన ఆరోపణలను కార్తీక్ ఖండించాడు. తన తండ్రి పరువు దిగజారిపోయే పనులు తాను ఎన్నటికీ చేయనని.. ఆమె చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలని తెలిపాడు. ఏదిఏమైనా.. మోడీ ప్రభుత్వంలో వున్న నాయకుల మీద ఒక్కొక్కటిగా ఇలా ఆరోపణలు రావడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసు నిజమేనని తేలితే మాత్రం.. మోడీ ప్రభుత్వం డేంజర్ లో పడిపోవడం ఖాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more