(Image source from: chandrababu naidu ready to do work with telangana cm kcr for people)
ఎప్పుడూ ఒకర్నొకరు తిట్టుకుంటూ నిత్యం కొత్త వివాదాలకు తెరలేపే తెలంగాణ - ఆంధ్రరాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - చంద్రబాబు.. ఇన్నాళ్ల తర్వాత ఒక్కటయ్యారు. మొన్నటికిమొన్నే గవర్నర్ సమక్షంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా కలుసుకున్న ఈ ఇద్దరూ సీఎంలు.. తమ రాష్ట్రాల్లో వుండే సమస్యల గురించి పరిష్కరించుకోవడమే కాకుండా సమావేశం అయిపోయిన అనంతరం ఒకరి గురించి ఒకరు బాగానే పొగిడేసుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అన్ని విషయాల్లోనూ తనకు సముఖత చూపినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజాగా ఆయన ఢిల్లీలో నరేంద్రమోడీని కలుసుకున్న అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అక్కడ కూడా కేసీఆర్ గురించి కొన్ని మంచి మాటలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాబు మాట్లాడుతూ.. కేసీఆర్తోనే ప్రజాసంక్షేమం సాధ్యం అవుతుందనే ధోరణిలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకర్నొకరు నిందించుకుంటూ, గొడవలు పడుతుంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని.. ఆ నేపథ్యంలో తామిద్దరూ కలిసి పనిచేస్తే ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎటువంటి ఇబ్బందులు వుండవని పేర్కొన్నారు. ఇవన్నీ సవ్యంగా జరగాలంటే కేసీఆర్ కలిసి పనిచేయడానికి ఒప్పుకోవాలని.. అప్పుడే ఇది సాధ్యపడుతుందని ఆయన వెల్లడించారు.
ఇందులో భాగంగానే బాబు.. ‘‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిత్యం గొడవలు పడుతూ వుంటే ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత వుంటేనే దీనిని పరిష్కరించుకోవచ్చు. ఇందుకు కేసీఆర్ కూడా సముఖత వ్యక్తం చేశారు. పరస్పరం గొడవ పడుతూనే వుంటే సమస్యలు పరిష్కారం ఎప్పటికీ కాలేవు. అందుకే ప్రజాసంక్షేమం కోసి కేసీఆర్తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇక చివరగా.. విభజన జరిగిన ఇంతకాలమైన ఐఏఎస్, ఐపీఎస్ల పంపిణీ ఇంకా పూర్తికాలేదని ఆయన మండిపడ్డారు.
AS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more