హైదరాబాద్ లో ప్లేబాయ్ క్లబ్బు ప్రారంభంపై దుమారమే రేగుతోంది. దేశ సంస్కృతిని చెడగొడుతున్నారంటూ ఇప్పటికే బారతీయ జనతా పార్టీ ఆందోళనలు చేస్తోంది. క్లబ్ ప్రారంభోత్సవం రోజు గొడవ కూడా చేసింది. దేశంలో ఎక్కడా క్లబ్ అనుమతివ్వలేదని.., తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. క్లబ్చులో న్యూడ్ డ్యాన్స్, అమ్మాయిలు మందు అందించటం వల్ల కల్చర్ దెబ్బతినటమే కాకుండా భవిష్యత్ యువత జీవితాలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం తీవ్రం అవుతుండటంతో సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు. ప్లేబాయ్ క్లబ్ అనుమతి ఇప్పటిది కాదని చెప్పారాయన.
అందరూ అంటున్నట్లు ప్లేబాయ్ క్లబ్ కు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాదని ఆనంద్ చెప్పారు. క్లబ్ కు ఉమ్మడి రాష్ర్టంలోనే అనుమతి లభించిందన్నారు. అనుమతితో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. క్లబ్ ఎప్పుడు అనుమతి తీసుకున్నా ఆలస్యంగా ప్రారంబించారని చెప్పారు. ఇక అనుమతి విషయంలోనూ నిబంధనలు విధించామన్నారు. న్యూడ్ డ్యాన్స్ అంగీకరించమని అనుమతి సమయంలో స్పష్టంగా చెప్పామన్నారు. సెమి న్యూడ్ డ్యాన్స్ కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. వీటికి తోడు విదేశాల్లో ఉన్నట్లు ఆడవారిచే మద్యం సరఫరా చేయిస్తే చూస్తూ ఊరుకోమని ముందే హెచ్చరించామన్నారు. క్లబ్ లో మహిళా ఉద్యోగి ఎవరూ ఉండరాదన్నారు. ఇలా మొత్తం 21 నిబంధనలతో ప్లేబాయ్ క్లబ్ కు అనుమతి ఇచ్చామని ఆనంద్ చెప్పారు. ఈ నిబంధనలు పాటిస్తేనే క్లబ్ కొనసాగుతుందని లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. క్లబ్ కు గత ప్రభుత్వం అనుమతిచ్చింది సరే.., సమాజంపై చెడు ప్రభావం చూపే ఇటువంటి వాటిపై ఈ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకలా చేయటం లేదనేదే ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. ప్లేబాయ్ లో ప్రభుత్వ పెద్దలు ఎవరికైనా ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్య ముందా లేక ప్రపంచస్థాయి సంస్థ హైదరాబాద్ కు వచ్చిందని చెప్పుకోవటం కోసం మౌనంగా ఉన్నారా?
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more