Ebola virus challenges to health minister doctor harsh vardhan

Ebola in India, ebola virus in world, o Health Minister doctor Harsh Vardhan, Ebola case in Mumbai, ebola case in maharsta, maharsta cm,

ebola virus challenges to Health Minister doctor Harsh Vardhan: No case of Ebola virus has been reported in India so far and the ... Union Health Minister Dr Harsh Vardhan held a meeting with senior officers from

హెల్త్ మంత్రికి సవాల్ విసిరిన ఎబోలా!

Posted: 08/12/2014 10:26 AM IST
Ebola virus challenges to health minister doctor harsh vardhan

మనదేశానికి ఎబోలా రాదని .. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ప్రకటన చేసి వారం రోజులు పూర్తి కాలేదు..!! కానీ ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికి ఎబోలా వైరస్ సవాల్ విసిరింది. ‘‘ఎబోలా వల్ల నో ప్రాబ్లమ్ అన్నావు.. ఇప్పుడు మీ ఇండియాకు వచ్చా!! ఇండియాలోని .. ముంబైయిలో.. ఎటాక్ చేసా అని ఎబోలా వైరస్ ’’ బాలయ్య డైలాగ్స్ ను గుర్తు చేసినట్లుగా ఇండియాలో మొదటి ఎబోలా కేసు బయట పడింది.!!

దీంతో ఇండియా సర్కార్ కు నిద్ర మత్తు వదిలింది. అసలే ప్రపంచ దేశాలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎబోలా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తికి ముంబై వైద్యులు చికిత్స అందిస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ఇటీవలే ఎబోలా ప్రబలిన నైజీరియా నుంచి ముంబై వచ్చిన లలిత్ కుమార్ అనే వ్యక్తికి వచ్చీ రాగానే వాంతులు మొదలైన నేపథ్యంలో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించిన వైద్యులు, అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు.

అంతేకాక అతడి నుంచి సేకరించిన నమూనాలను పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సురేశ్ శెట్టి తెలిపారు. లలిత్ కుమార్ కు ఎబోలా సోకిందని ఇప్పటిదాకా నిర్ధారణ కాలేదని వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే, ఆఫ్రికా నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి ఎబోలా సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. అతడి నమూనాలను పరిశీలించిన పూణె వైరాలజి ప్రయోగశాల, నమూనాల్లో ఎబోలా వ్యాధి లక్షణాలు లేవని తేల్చేసింది.దేశంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు అమలులో ఉండే ఈ ఎమర్జెన్సీ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల వద్ద వైద్య బృందాలను నియమిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మొదటి కేసు పై మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఏమాంటారో చూడాలి! ముంబైయిలో ఎబోలా కేసు బయటపడటంతో.. దేశంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆయా రాష్ట్రాల సర్కార్ ముందుగా తగు చర్యలు తీసుకోవలని .. ఆరోగ్య సంస్థలు కోరుతున్నాయి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more