Subhash chandrabose family members fires pm narendra modi on bharat ratna award

subhash chandrabose news, nethaji family members, nethaji award, bharat ratna award controversial, pm narendra modi, central government of india, bharat ratna awards, trinamul congress leaders

subhash chandrabose family members fires pm narendra modi on bharat ratna award : Subhash chandrabose (nethaji) family members fires against central government of india and narendra modi for presenting bharat ratna award without giving the full information about his disappear

‘‘బారతరత్న’’తో నేతాజీని అవమానపరుస్తున్నారా..?

Posted: 08/11/2014 01:06 PM IST
Subhash chandrabose family members fires pm narendra modi on bharat ratna award

స్వాతంత్ర్య సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్ (నేతాజీ)తోపాటు దివంగత మదన్ మోహన్ మాలవ్యా, మాజీ ప్రధాని వాజ్ పేయి, కాన్షీరాం, భారత హాకీ మాజీ కెప్టెన్ దివంగత ధ్యాన్ చంద్ తదితరులకు అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘‘భారతరత్న’’ అవార్డు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో నేతాజీకి సదరు అవార్డు ఇచ్చి ఆయనను అవమానపరుస్తున్నారని నేతాజీ సోదరుడి తమ్ముడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుగతోబోస్, చంద్రకుమార్‌ బోస్‌ లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అవార్డును తాము స్వీకరించబోమని నేతాజీ కుటుంబసభ్యులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అవార్డు ఇస్తే ఆయనతోపాటు, తమ కుటుంబాన్ని కూడా అవమానపరిచినట్లేనని వారు మండిపడుతున్నారు.

ఈ అంశం మీద నేతాజీ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. ‘‘నేతాజీకి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అదృశ్యం వెనుక వున్న మిస్టరీని ఛేదించి, ఆ వివరాలను మా కుటుంబసభ్యులతోపాటు యావత్తు దేశానికి విశదీకరించండి’’ అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. 1945వ సంవత్సరం నుంచి నేతాజీ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కన్నుమూశారో.. దానికి తగిన ఆధారాలేమిటో ప్రభుత్వం స్పష్టంగా వివరించాలని వారు కోరుతున్నారు. ఈ భారతరత్న పురస్కారాన్ని ఆయనకు అందజేయాలంటే.. ముందుగా ఆయన మరణించిన వివరాలను పూర్తిగా చెప్పాలంటూ నేతాజీ కుటుంబీకులు పట్టుబడిమరీ కోరుతున్నారు. ఇలా కానిపక్షంలో నేతాజీకి భారత్నరత్న ఇచ్చి అవమానపరిచినట్లేనని వారు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే వారు మాట్లాడుతూ.. నేతాజీ లాంటి స్వాతంత్ర్య సమరయోధుడికి రాజీవ్ గాంధీ కంటే ముందే ఎందుకు ప్రకటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ స్థాయి రాజీవ్ కంటే చాలా ఎక్కువని.. అయినా ఆయనకి ముందుగా ఈ అవార్డు ఇవ్వకుండా ఘోరంగా అవమానపరిచారని వారు మండిపడుతున్నారు. ఇదిలావుండగా.. నేతాజీగారు అదృశ్యమైన వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయనిదే తాము ఈ అవార్డును ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని వారు ఖరాఖండీగా స్పష్టం చేశారు. అయితే భారత ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్టు ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more