High court judge justice k narasimha reddy controversial comments telugu language

High court judge k narasimha reddy, high court judge comments telugu language, telugu people, andhra telangana news, telugu people andhra pradesh, high court judgets, mandali buddha parasad

High court judge justice k narasimha reddy controversial comments telugu language : andhra pradesh high court judge creates new sensation by comment on telugu language and telugu people that... our telugu people are no longer interested to save their mother tongue

తెలుగువారు ‘‘తెలుగు’’ భాషలో మాట్లాడితే శిక్షిస్తున్నారు!

Posted: 08/05/2014 12:16 PM IST
High court judge justice k narasimha reddy controversial comments telugu language

అవును..! మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వుంటున్న ప్రజలు తెలుగు మాట్లాడితే శిక్షిస్తున్నారట! ఒకవేళ తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే.. వారికి గొప్పోళ్లుగా భావించి.. దండలు వేసిమరీ గౌరవిస్తున్నారట! ఈ మాటలు అన్నది ఎవరో కాదు... సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరిస్థితులను బేరీజు రవేసుకుని చూస్తే... రాష్ట్రేతరులే (ఇతర రాష్ట్రంవారు) తెలుగును చాలా బాగా పోషించుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఇక్కడ (ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో) తెలుగులో మాట్లాడితే శిక్షిస్తున్నారు.. తెలుగు రాదంటే ఉన్నత శ్రేణికి చెందినవారుగా భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో మండలి కృష్ణారావు సంస్కృతీ పురస్కార దినోత్సవం ఎన్టీఆర్ కళామందిరంలో సోమవారం రాత్రి జరిగింది. బర్మా తెలుగు సంఘం (మయన్మార్) అందజేసిన 2013 సంస్కృతి పురస్కారాన్ని ఆ సంఘం తరఫున ఎర్రనాయుడు.. ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై)కు అందజేసిన 2014 సంస్కృతి పురస్కారాన్ని ఆ సంఘానికి ప్రతినిధి అయిన ఆదిశేషయ్యలు అందుకున్నారు. పురస్కారం కింద ఒక్కో సంఘానికి రూ.25 వేల నగదును అందుకున్నారు.

ఈ కార్యక్రమంలోనే పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాలు, దేశాల్లో స్థిరపడినవారంతా ఎన్నో కష్టాలు పడి తమ భాషను పరిరక్షించుకోవడానికి నడుం బిగిస్తుంటే... మన తెలుగువారు మాత్రం అందులో వెనుకబడి వుండటం గమనించాల్సిన విషయమని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. ఇరు ప్రభుత్వాలను ఒప్పించి తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more