ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా పశ్చిమగోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటన చేయటానికి సిద్దమయ్యారు. రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన ఉంటుందని టీడీపి నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఈ రెండు రోజలు పర్యటనలో పశ్చిమ గోదావరిలో ఎలాంటి వరాలు కురిపిస్తాడోనని తెలుగు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వివిధ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. పాలనను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే జిల్లాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన రైతులు, మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీపై ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది.
షెడ్యూల్..
ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు ద్వారక తిరుమల చేరుకుంటారు. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కామవరపు కోటలో ఏర్పాటు చేయనున్న రైతు సదస్సులో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు జంగారెడ్డి గూడెంలో రోడ్ షో నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.
మరుసటి రోజు ఉదయం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు బాబు. అనంతరం కొయ్యలగూడెం టొబాకో బోర్డులో పొగాకు రైతులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు డ్వాక్రా మహిళా సంఘాల సదస్సులో పాల్గొంటారు. రైతులకోసమే ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉన్న చంద్రబాబు అందరికి తగిన న్యాయం చేస్తారని టిడిపి ఎంపీ మాగంటి బాబు చెప్పుకొస్తున్నారు.
సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అటు ప్రభుత్వ యంత్రాగం ఇటు పార్టీ నాయకత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రయోజనం కలిగేలా చంద్రబాబు చర్యలు ఉండాలని అందుకు సంబంధించి ఆయనకు వినతిపత్రాలు కూడా సమర్పిస్తామని సీపీఎం నేతలు అంటున్నారు.
అయితే చంద్రబాబు పర్యటనపై పశ్చిమ గోదావరి జిల్లా వాసులు భారీ అంచనాలే వేసుకుంటున్నారు. మరి బాబు వారిని సంతృప్తి పరిచి వరాలు కురిపిస్తారా ? లేదా ఎప్పటిలాగే. మామగారి గురించి, తెలుగు యువత గురించి నాలుగు మాటలు చెప్పి సైలెంట్ గా జారుకుంరా అనేది చూడాలి.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more