Bjp leader haribabu fire on jaipal reddy

bjp leader haribabu fire on jaipal reddy, parlament, jaipal reddy, congress party, bjp, polavaram bill, telangana, andhrapradesh.

bjp leader haribabu fire on jaipal reddy

రెడ్డిగారు పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారు?

Posted: 07/14/2014 09:13 AM IST
Bjp leader haribabu fire on jaipal reddy

పోలవరం పై రెండు రాష్ట్రాల నాయకుల మద్య మాటల యుద్దం జరుగుతుంది. అయితే కేంద్రం మాత్రం పోలవరం బిల్లును పాస్ చేయటానికే సిద్దమయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు పోలవరం బిల్లు పై మండిపడుతున్నారు. అలాంటి వారిలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ నాయకుడు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పోలవరం బిల్లు పై విచిత్రమైన విమర్శలు చేసి అందరి ముందు నవ్వుల పాలయ్యాడు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్ర విభజన, పోలవరం పై నిర్ణయం తీసుకున్న విషయం జైపాల్ రెడ్డికి తెలిసినప్పటికి ఆయన మీడియా ముందు బిజేపి ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం బిల్లు రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు ధ్వజమెత్తారు.

పోలవరం బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం రాజ్యాంగ విరుద్ధమని అంటున్న జైపాల్‌రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు విరుద్ధమైతే రాష్ట్ర విభజన కూడా విరుద్ధమేనని ఆయన అన్నారు. లేనిపోని వివాదాలు చేస్తే ఇతర విషయాలు కూడా బయటకు వస్తాయని హరిబాబు హెచ్చరించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more