ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ అభివృద్ది పై వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో సీమాంద్ర రాజధాని కోసం గంటా శ్రీనివాసరావు శ్రద్దగా కృషి చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది లో బాగంగా సినీ పరిశ్రమ పై గంటా దృష్టి పెట్టారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమను అభివృద్ది చేయటానికి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
విశాఖలో అరకు, భీమిలి ప్రాంతాలలో సినీ షూటింగ్ స్పాట్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు . ఇందుకోసం టాలీవుడ్ సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు అందరు సహకరించాలని ఆయన కోరారు. అంతేకాకుండా విశాఖ పట్నంలో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్ ను త్వరగా నిర్మించాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నామని ఆయన తెలిపారు. అలాగే విశాఖ అభివృద్ధి లో భాగంగా మెట్రో రైలు ను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం కొత్తగా టెండర్లను కూడా ఆహ్వానించినట్లు గంటా వెల్లడించారు.
అయితే విశాఖ పట్నం ను ఆర్దిక రాజధాని చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇది వరకే తెలిపారు. అంతేకాకుండా విశాఖపట్నంలో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే 200 పడకల సామర్ద్యం ఉన్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రూ. 60 కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తామని, విశాఖ ను కాలుష్య రహిత నగరంగా నిర్మిస్తామని అయ్యన్న పాత్రుడు తెలిపిన సంగతి తెలిసిందే.
విశాఖలో గంటా అభివృద్ది వేగవంతంగా జరగాలని సీమాంద్ర ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ముందుగా సీమాంద్ర ప్రజలు చంద్రబాబు కు సహకరించాలని ..టిడిపి మంత్రులు కోరుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా సీమాంద్ర అభివృద్ది కోసం కలిసి వస్తే, సీమాంద్రను సింగపూర్ చేయటానికి ఎంతో సమయం పట్టదని రాజకీయ మేథావులు అంటున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more