తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘరం .. ఘరం అవుతున్నారు. కొత్త రాష్ట్రం వచ్చి 10 రోజులు కాక ముందే.. కేసిఆర్ సార్ ఘరం. ఘరం అవుతున్నారని తెలంగాణ అధికారులు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత.. అన్ని పంచుకోవటం జరిగింది. ఇక తెలంగాణ లో తిరిగే.. వాహనాల సమస్య ఇప్పుడు కేసిఆర్ వద్దకు వచ్చింది. ఆంద్ర వాహనాలకు ఎలాంటి సమస్యలేదు. కానీ నిన్నటి వరకు టీజీ, టీఎస్ అనే పేర్ల మద్య వివాదం నడిచి , కొలికి వచ్చింది.
అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏపీ సిరీస్ తో 73 లక్షల పాత వాహనాలు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల విషయంలో రాష్ర్ట ప్రభుత్వం నాలుక్కరుచుకుంది. వాహనాలకూ కొత్తగా టీఎస్ సిరీస్తో కొత్త నంబర్లు పొందాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.పాత వాహనాలకు కొత్త జిల్లా కోడ్తో పాటు ఏపీ బదులు టీఎస్ అని మార్చాల్సి ఉంటుందని, నంబర్ మాత్రం అదే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణలో నంబర్ ప్లేట్ల మార్పు విదానం అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘరం ఘరం అయినట్లు తెలుస్తోంది.
అయితే చివరకు కేసిఆర్ కల్పించుకొని .. నంబర్ ప్లేట్ల వివాదానికి తెరదించారు. వాహనాల నంబర్ ప్లేట్లు మార్చాల్సిన అవసరం లేదని,AP స్థానంలో TSగా మార్చుకుంటే సరిపోతుందని తెలిపారు. వాహనాల నెంబర్ ప్లేట్లపై రవాణాశాఖ మంత్రికి సరిగ్గా వివరించలేకపోవడంవల్లే సమస్య వచ్చిందని అయన అభిప్రాయపడ్డారు.ఇకపై కొత్త వాహనాలకే టీఎస్ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయాలని, పాత వాటికి కేవలం టీఎస్తో పాటు జిల్లా కోడ్ను మార్చితే సరిపోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. భారీ రుసుము చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మరోవైపు కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతి మేరకు వాహనాలకు కోడ్ నెంబర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాకు టీఎస్-1, కరీంనగర్ జిల్లాకు టీఎస్-2, వరంగల్ జిల్లాకు టీఎస్-3, ఖమ్మం జిల్లాకు టీఎస్-4, నల్లగొండ జిల్లాకు టీఎస్-5, మహబూబ్నగర్ జిల్లాకు టీఎస్-6, రంగారెడ్డి జిల్లాకు టీఎస్-7, టీఎస్-8, హైదరాబాద్ జిల్లాకు టీఎస్-9 నుంచి టీఎస్-14 వరకు కేటాయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more