Botsa satyanarayana press meet on telangana issue

botsa satyanarayana press meet on telangana issue, Botsa Satyanarayana Clarification on Telangana Decision, Botsa-Satyanarayana

botsa satyanarayana press meet on telangana issue, Botsa Satyanarayana Clarification on Telangana Decision

తెలంగాణ అనుమానాలు వద్దు

Posted: 10/31/2013 07:41 PM IST
Botsa satyanarayana press meet on telangana issue

*   పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.

*   ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై అనుమానాలు వద్దని, ఎవరేంటో తెలియాలనే మరోసారి అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

*   ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు కేంద్రం అఖిలపక్షాన్ని వేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ అంశంపై కేంద్రం నుంచి మరింత స్పష్టత వచ్చాకే పార్టీ తరపున ఢిల్లీకి వెళ్లేది ఎవరనేది ఖరారు అవుతుందని తెలిపారు.

 

*   ఈ అవకాశాన్ని అన్ని పార్టీలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అయితే అఖిలపక్షంపై ప్రజలను మభ్యపెట్టొద్దని బొత్స విజ్ఞప్తి చేశారు.

*   సమస్యల పరిష్కారం కోసమే కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందన్నారు.

*   రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలని బొత్స పేర్కొన్నారు.

*   పార్టీలో ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్ను నష్టపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆయన అన్నారు.

*   కాంగ్రెస్ను వీడేవారు వెళ్లిపోవచ్చని బొత్స వ్యాఖ్యానించారు. అయితే పార్టీని వీడి వెళ్లిపోవాలనుకున్నవారిపై చర్యలేం తీసుకుంటామని ఆయన అన్నారు.

*   అఖిలపక్ష సమావేశం వల్ల మంచి జరుగుతుందని సీమాంధ్ర నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా అనుకుంటున్నట్లు బొత్స తెలిపారు.

*   సిపిఎం మినహా అన్ని పార్టీలు రాష్ట్రాన్ని విభజించాలనే చెప్పాయని ఆయన అన్నారు.

*   రాష్ట్రాన్ని విభజించాలని తెలుగుదేశం పార్టీ అన్ని అఖిల పక్ష సమావేశాల్లోనూ చెప్పిందని ఆయన గుర్తు చేశారు.

 

*   రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పిందని, కేంద్రం తండ్రి పాత్ర పోషించాలని అంటున్న జగన్‌కు ఆ రోజు సమైక్యం గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు.

*   కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నందున పార్టీలు రాజకీయ చేయడం మానేసి సమస్య పరిష్కారానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

*   అపోహలను, అనుమానాలను పక్కకు పెట్టి పార్టీలు వాస్తవాలకు దగ్గరగా వెళ్లాలని బొత్స సూచించారు.

*   ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించవద్దని ఆయన సలహా ఇచ్చారు.

*   అధికారం కోసం రాజకీయం చేయడం మానేసి సామరస్యపూర్వక వాతావరణంలో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.

*   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెట్టబోరని బొత్స చెప్పారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more