అవినీతిపై పారాడదాం రండని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అయితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ‘ఆయన’ చెంప పైకొట్టమని పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ ఇద్దరు పోరాటం చేయటానికి ముందుకు వస్తున్నారు. ఇద్దరు యువనేతలే. అయితే ఆయన చెంప పై కొట్టమని పిలునిచ్చింది రాహుల్ గాంధీ పైన కాదులేండి. రాహుల్ రాజగురువు అయిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చెంప మీద కొట్టమని జగన్ చెప్పటం జరిగింది. అసలు విషయం ఏమిటంటే.. రాహుల్ గాందీ లోక్ పాల్ బిల్లు అనేది జాతీయ స్థాయిలో అత్యంత ప్రాముఖ్యం గల బిల్లు అని చెప్పారు.
ఈ బిల్లును ప్రతిపక్షాలు సహా అన్ని రాజకీయ పక్షాలూ సహకరించాలని ఆయన కోరారు. అందరి నుంచి మద్దతు లభిస్తే బిల్లును ఆమోదింపజేసుకోగలమని ఆయన చెప్పారు. లోక్పాల్ బిల్లును ఆమోదింపజేయాలని ఎంతో కాలంగా తాము కృషి చేస్తున్నామని అయితే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం వల్ల అది సాధ్యం కావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. లోక్ పాల్ అనేది అవినీతిపై ప్రతి ఒక్కరూ సంధించగల బ్రహ్మాస్త్రమని, అందువల్ల ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దీన్ని అందరూ ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చెంపపై కొట్టమన్న జగన్
రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో ఓటింగు జరిగినప్పుడు అందరూ మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకోవలసిందిగా జగన్ విజ్ఞప్తి చేశారు. జగన్దీ, తమదీ ఒకే డిఎన్ఏ అన్న కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ను చెంపమీద కొట్టండని జగన్ అన్నారు. సోనియా గాంధికి మద్దతు ఇచ్చేది లేదని గతంలోనే స్పష్టం చేశామని ఆయన పునరుద్ఘాటించారు. సమైక్యం కోసం కృషి చేసేవారికే తమ మద్దతు అని జగన్ స్పష్టం చేశారు. సమైక్యంకోసం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డని నమ్మవద్దని ఆయన పిలుపు ఇచ్చారు.
రాష్ట్ర విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలకూ నచ్చజెప్పడానికి తాను చేసిన యత్నాల గురించి కూడా ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఒక్కసారైనా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరారా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కిరణ్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more