జేసీ బ్రదర్స్ అంటే.. బట్టల వ్యాపారసంస్థల యాజమానులు కాదులేండి.. ఈ జేసి బద్రర్స్ .. రాజకీయంలో ముదిరిన బ్రదర్స్. జేసి బ్రదర్స్ అంటే.. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజక వర్గంలో తెలియని వారు ఎవరు ఉండరు. వీరు ఇప్పుడు ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అనే పాటను పాడుకున్నారు. అయితే వీరు ఎగిరిపోవటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి కాలుదువ్విన జేసి బ్రదర్స్ గత కొద్ది రోజుల నుండి వీరి సందేశాలు, ప్రకటనులే ఇందుకు నిదర్శం. జేసీ దివాకర్రెడ్డి కాంగ్రెస్తో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోనున్నారా? ఇన్నాళ్లూ తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ గూటికి సోదరుడు జేసీ ప్రభాకర్రెడ్డితో కలిసి చేరనున్నారా? రెండున్నరేళ్ల క్రితం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే జేసీ సోదరులు ఇప్పుడు కాంగ్రెస్ను వీడుతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. నవంబర్ 7న గానీ, 9న గానీ టీడీపీలో చేరడానికి జేసీ సోదరులు ముహూర్తాన్ని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
1982లో తాడిపత్రి శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన జేసీ దివాకర్రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గాల్లో స్థానం దక్కించుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అనంతపురం లోక్సభ స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జేసీ ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆరోపణలపై 2009లో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో జేసీకి స్థానం దక్కకుండా కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంది.
ప్రత్యర్థి అయిన రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తన ఆధిపత్యం చాటుకుంటూ జేసీని ఒంటరిని చేశారు. దీంతో రఘువీరా ఆధిపత్యానికి గండికొట్టాలన్న లక్ష్యంతోనే దివాకర్రెడ్డి చంద్రబాబుతో చేతులు కలిపారని స్థానిక నేతలు చెబుతారు. అలా చేతులు కలిపే 2011 మార్చి 24న జరిగిన అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి తన వర్గీయులతో ఓట్లేయించి ఆయన గెలుపుతో ప్రధాన భూమిక పోషించారు. తదుపరి జరిగే ఎన్నికల్లో అనంతపురం లోక్సభ సీటుతో పాటు ఆ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రెండు శాసనసభ టికెట్లను తమకు ఇచ్చేలా జేసీ బాబుతో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్నట్లు అప్పట్లో ఆ పార్టీ వర్గాలే వెల్లడించాయి.
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన తర్వాత జేసీ దివాకర్రెడ్డి, చంద్రబాబుల మధ్య మ్యాచ్ఫిక్సింగ్ మరింత పదునెక్కింది. చంద్రబాబు వైఖరిని సమర్థిస్తూ జేసీ పలు సందర్భాల్లో బాహాటంగా మాట్లాడారు. ఇదే క్రమంలో . సాధారణ ఎన్నికలు ముంచుకొస్తోన్న నేపథ్యంలో టీడీపీ గూటికి చేరాలన్న లక్ష్యంతోనే జేసీ సోదరులు చంద్రబాబు చేసే ఆరోపణలను సమర్థిస్తూ విమర్శలు చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. 2014లో తాడిపత్రి నుంచి జేసీ దివాకర్రెడ్డి, రాయదుర్గం నుంచి దీపక్రెడ్డి (ప్రభాకర్రెడ్డి అల్లుడు), అనంతపురం లోక్సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థులుగా పోటీచేయడం ఖాయమని జేసీ ప్రభాకర్రెడ్డి స్పష్టం చేసినట్లు ఆ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే వర్గాలు వెల్లడిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more