సీమాంధ్రలో ఉద్యమం నిరవధికంగా కొనసాగుతున్నా.... సీమాంధ్ర నాయకులు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంశాన్ని, దానికి సంబంధించిన ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నా... కేంద్రం మాత్రం వాటిని పట్టించుకోకుండా సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేసినట్లే తెలుస్తుంది తాజాగా జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే. నిన్న మొన్నటి వరకు తెలంగాణ నోట్ వాయిదా పడుతుందని, ఆ నోట్ కేబినెట్ ముందుకు రావడానికి మరికొంత కాలం పడుతుందని కేంద్ర మంత్రివర్గంలోనే కాకుండా, షిండే కూడా ప్రకటన చేయడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులు, ఉద్యమ నాయకులు తెలంగాణ నోట్ ఉద్యమం వల్లే ఆగిందని బీరాలు పలికారు.
అప్పట్లో డిగ్గీ రాజా అక్టోబర్ మొదటి వారంలో కేబినెట్ ముందుకు నోట్ వస్తుందని అన్నారు. దాని ప్రకారమే నేడు సాయంత్రం అయిదున్నరకు కేంద్ర కేబినెట్ సమావేశమవుతుందని నేషనల్ మీడియా అంటుంది. ఈ వార్తలకు బలం చేకూరేలా విదేశాల్లో నుండి తిరిగి వస్తూ ప్రధాని మన్మోహన్ కూడా తెలంగాణ పై ద్రుష్టి సారించినట్లు, తెలంగాన ప్రక్రియ ముందుకే కానీ వెనక్కి లేదని చెప్పాడు. ఈ తెలంగాణ నోట్ టేబుల్ ఎజెండా రూపంలో కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. తెలంగాణపై హోంశాఖ రూపొందించిన ముసాయిదా నోట్ ఈ సమావేశానికి వస్తుందని, ఇందుకు సంబంధించి కేంద్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయని తెలిపింది.
కేబినెట్లో ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిస్తారని, ఆ తర్వాత వారం, పది రోజుల్లో అసెంబ్లీకి పంపించే దిశగా కసరత్తు సాగుతోందని నేషనల్ ఛానెల్లు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో సాగుతున్న ఉద్యమం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి మొదలైనవాటిని కూడా కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిశితంగా పరిశీలిస్తుందని, మొదట తెలంగాణ బిల్లు ప్రక్రియ పూర్తయిన తరువాత సీమాంధ్రలో ఉన్న సమస్యల పై ద్రుష్టి పెట్టనున్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more