ఢిల్లీ నాయకులు ప్రతి రోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఉరిస్తున్నారు. ప్రతి గంటకొకసారి మీడియా ముందుకు వచ్చిన తెలంగాణ నోట్ రెడీ అవుతుందని చెప్పి, ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు. కేంద్ర నాయకులు ఇచ్చిన ప్రకటన నిజమే అనుకోని, తెలంగాణ నాయకులు, సీమాంద్ర నాయకులు మద్య విభేధాలు పెరుగుతున్నాయి. అసలు తెలంగాణ నోట్ రెఢీ అవుతుంటే.. ముందుగా ఈ లీక్ వార్తలు ఎందుకు, ఇరుప్రాంతాల ప్రజల మద్య వైషమ్యాలు రగిలించటానికి తప్పితే.. ఎలాంటి లాభం లేదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్ర కోసం చేస్తున్నారని ఇరుప్రాంతాల ప్రజలు అంటున్నారు. ‘‘తినబోతు.. గారెల రుచి గురించి అడిగినట్లు ’’ లంగాణ విభజన నోట్ తయారు చేస్తూ, మద్య ఇలాంటి లీక్ లతో రాష్ట్ర రావణకష్టంగా మారుతుందని విషయం కాంగ్రెస్ పెద్దలకు తెలియని విషయం కాదు. అయితే కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణ నోట్ తో నాటకం ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రీసెంట్ గా ఢిల్లీ నుండి ఒక విషయం లీక్ అయ్యింది. ఇప్పటి వరకు తెలంగాణ నోట్ అనేది తయారు కాలేదనే విషయం బయటకు వచ్చింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రి మండలికి వెళ్లాల్సిన పత్రం ( కేబినెట్ నోట్ ) ఇంకా తయారు కాలేదని సీమాంద్ర మంత్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నోట్ తయారు చేసే విషయం లో సీమాంద్ర నేతల హస్తం తప్పనిసరిగా ఉంటుందని ఢిల్లీ పెద్దలు కొంతమంది అంటున్నారు.
అయితే ఆ నేతలు ఎవరు అనేది మాత్రం సీక్రెట్ గా ఉంచారు. తెలంగాణ నోట్ తయారుచేసి విభజన ప్రక్రియతో సంబంధమున్న 10 శాఖలకు పంపిస్తారు. ఆ తరువాత పిఎంఓకు, కేబినెట్ కు చేరుతుంది. ఈ ప్రక్రియ అంతా వేగంగా జరిగితేనే, హోం శాఖ కార్యదర్శి నోట్ తయారు చేసిన నాటి నుంచి కనీసం మూడు వారాలు పడుతుంది. అదీ ఈ నాలుగైదు అంచెల్లో ఎక్కడా ఎలాంటి అభ్యంతారాలు వ్యక్తం కాకపోతోనే , ఏ అభ్యంతరం వ్యక్తమైనా ఇంకా ఆలస్యమవుతుంది. ఇప్పటి వరకు కేబినెట్ నోట్ తయారే కాలేదు అని ముఖ్యమంత్రి కిరణ్ వివరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం పై మండిపడుతున్నారు. అయితే సీఎం ఆద్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, సీమాంద్ర నేతలు కలిసి చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇరుప్రాంత నేతలు కలిసి ఒక చోట సమావేశం అయి, రాష్ట్ర విభజన పై చర్చలు సాగించేందుకు ఇరుప్రాంతాల నేతలు సిద్దమవుతున్నారు. అయితే ఈ సమావేశం ఎప్పుడు, ఎక్కడ అనేది, ఇంక చెప్పలేదు. త్వరలో ఈ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more