అవును మీరు చదివింది కరెక్టే. ఇప్పుడు జనం గడ్డి తింటున్నారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్లు చాలా ఆనందంగా ఉన్నారు. అనారోగ్యంతో డాక్టర్ల వద్దకు వచ్చిన వారిని కూడా మీరు ఉదయం , సాయంత్రం కాస్త గడ్డి తినండని చెబుతున్నారు. డాక్టర్లు మాటలు మొదట్లో అర్థంకాక ఖంగరుపడిన జనం తరువాత అర్థం చేసుకొని, గడ్డి తినటం ప్రారంభిస్తున్నారు. గడ్డి తిన్న జనం మాత్రం ఆరోగ్యంగా. ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. అసలు ఇంతకీ ఈ గడ్డి విషయం ఏమిటంటారా? సహాజంగా ఎవరినైనా మందలించాలన్నా, విమర్శించాలన్నా ఈ గడ్డినే ఊత పదంగా వాడుతాం. ఏం గడ్డి తిన్నావురా? అని అంటారు. గడ్డిఏమైన తింటున్నావా? అని విమర్శిస్తారు. ఇకనుంచి గడ్డిని చుకలన చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు గడ్డికి బంగారు రోజులు వచ్చాయి. పశువుల పెంపకంలో, గడ్డికి ఉన్న ప్రాధాన్యతే వేరు ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ గడ్డే ప్రథమ స్థానం ఆక్రమించేస్తోంది.
పెరిగిన గోధుమగడ్డి సాగు.. విశాఖ జిల్లాలో పశువుల కోసం కాకుండా మనుషుల కోసం గడ్డిని పండిస్తున్నారు. అయితే అది పశువులు తినే గడ్డి అని మాత్రం అనుకోకండి అది మనకు తెలిసిన గోధుమ గడ్డి. విశాఖ నుంచి అరకు వ్యాలి వరకు ఈ గడ్డి పేరు చెబితే చాలు జనం లొట్టలేస్తున్నారు. లావు తగ్గాలన్నా కొవ్వు తగ్గించుకోవాలన్నా ఈ గడ్డినే ఉపయోగిస్తున్నారు. డైటింగ్ చేయడానికి జ్యూస్ తయారు చేసుకుని మరీ తాగేస్తున్నారు. రోజూ ఇలా తాగడం వల్ల చాలా రకాల జబ్బులు మాయమైపోతున్నాయని అంటున్నారు విశాఖ వాసులు. మొదట్లో నమ్మకపోయినా తాగిన తర్వాత మెరుగైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు. విశాఖ, అరకు ప్రాంతాల్లో గోధుమ గడ్డికి గిరాకీ పెరగడంతో నర్సరీల మాదిరిగా అక్కడ కుండిల్లో గడ్డిని పెంచుతున్నారు. దీనిని ఇంటిలో కూడా తయారు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని గోధుమ గడ్డి పెంపకందారులు చెబుతున్నారు
సర్వరోగనివారణి..
ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం, జీర్ణకోశ వ్యాధులు, రక్తహీనత, బీపీ, షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లావు తగ్గించడం, చలాకీతనంతో పాటు చాలా రకాల జబ్బులకు ఇది రోగ నివారిణిలా పనిచేస్తుందంటున్నారు. ఈ గ్రీన్ గ్రాస్ జ్యూస్ను ఎప్పడు పడితే అప్పడు తాగకూడదు. ఉదయం లేచిన తర్వాత కోంచెం కసరత్తుల చేసి టీకప్పులో సగం మాత్రమే తాగాలని, గంట తరువాత కాలకృత్యాలు తీర్చుకోవాలని చూచిస్తున్నారు. 9 నుండి 13 రోజుల వయసున్న గడ్డిలోనే పోషక విలువలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ గడ్డి కోసం జనం ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్యం పై ప్రజలు ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు. గడ్డి తింటున్న జనాన్ని చూసి విశాఖ డాక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ద చూపించటం చాలా ఆశ్చర్యంగా ఉందని డాక్టర్లు అంటున్నారు. ఖర్చు తక్కువ .. ఆరోగ్యం ఎక్కువగా ఉండటంతో.. ప్రజలు ఈ గడ్డి పై ఆసక్తి చూపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more