తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి డైలాగులు చెప్పడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తుంటారు.ఆయన డైలాగులకు ఇతర పార్టీ అభిమానులలో ఎంత వ్యతిరేకత వచ్చినా, సొంత పార్టీలో మాత్రం ఆయన డైలాగులకు విపరీతంగా ఇష్టపడేవారు ఉంటారు. రీసెంట్ గా ఆయన చేసిన రెండు డైలాగులు తీ్వ్రంగా ఉన్నాయి. వాటిలో ఒకటి పిల్ల కాంగ్రెస్ నేతలు తమ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో పెడితే చెప్పుతో కొట్టండి అని ఆయన వ్యాఖ్యానించడం. ఆ మేరకు ఆయన టిడిపి కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.ఈ డైలాగులకు కృష్ణా జిల్లాకు ఒక సంబంధం ఉంది . అయినా ఎన్టీఆర్ బొమ్మను వాడుకునే హక్కు ఎన్.టి.ఆర్.అభిమానులు ఉందని, అయితే ఎన్టీఆర్ బొమ్మను ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. కాని దానిని ఒప్పుకోవడానికి టిడిపి నేతలు సిద్దంగా లేరు. ఈ నేపధ్యంలో రేవంత్ ఈ మాట అంటూ ఎన్.టిఆర్ ఫోటోలు వాడితే వాళ్లని చెప్పుతో కొట్టాలని అంటున్నారు.
నిజానికి ఇది అభ్యంతరకర మాటే అయినా కేవలం పార్టీలో జోష్ నింపడానికి రేవంత్ రెడ్డి ఈ డైలాగు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి వైఎస్ జగన్ నెంబర్ వన్ అని అన్నారు. జగన్ ఎప్పటికి నంబర్ వనే అని రేవంత్ రెడ్డీ టిడిపి సభలో అనటంతో టిడిపి నాయకులు షాక్ తిన్నారు. అంటే రేవంత్ రెడ్డి అర్థం మరోలా ఉందని, తరువాత తెలిసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవాడు. అంతా ఆయన అనుకున్నట్లే జరుగుతుంది. అక్రమాస్తుల కేసులో ఏడాది కాలంగా చంచల్ గూడ జైలులో ఉంటున్న వైఎస్ జగన్ అక్కడ నంబర్ వన్ గానే ఉన్నాడు. ఈ లెక్కన కూడా వైఎస్ కోరిక తీరింది అని రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసుల్లో ఉన్న జగన్ అన్ని కేసుల్లోను సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అలా వ్యంగాస్త్రాలు విసిరారు. సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఇది తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more