విఫ్ దిక్కరించి అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 15 మంది శాసనసభ్యుల పై స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేశారు. ఈవేటు ఊహించినదే అయిన ఇన్నిరోజుల నుండి పెండింగ్ లో ఉంచిన నిర్ణయం పై స్పీకర్ నేడు నిర్ణయాన్ని వెల్లడించారు. అనర్హత వేటు పడినవారిలో 9 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఆరుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. ఈ విషయాన్ని మనోహనర్ ఈరోజు మీడియా సమావేశంలో వెల్లడించారు.
అనర్హత వేటు పడిన వారిలో సుజయ రంగారావు (బొబ్బిలి), ఆళ్ల నాని (ఏలూరు), పి.. సాయిరాజ్ (ఇచ్చాపురం), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (పుంగనూరు), అమర్నాథ్ రెడ్డి (పలమనేరు), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), జోగి రమేష్ (పెడన), ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి (కాకినాడ అర్బన్), ఎ రాజేష్ (చింతలపూడి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), తానేటి వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), పేర్ని నాని (మచిలీపట్నం), శివప్రసాద్ రెడ్డి (దర్శి) శాసన సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలా చారి, చిన్నం రామకోటయ్యలను వేటు నుంచి మినహాయించారు. ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్తపడే విదంగా జూన్ వరకు జాప్యం చేసి, ఇప్పుడు అనర్హత వేటు వేటు వేయడం మర్శగా ఉంది. పదిహేను మంది ఎమ్మెల్యేలు తాము విప్ దిక్కరించామని,తమను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని కోరినా స్పీకర్ ఇన్నాళ్ళు నాన్చుతూ వచ్చారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా మార్చి15న అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. వేటు పడిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. వేణుగోపాలాచారి నాగం జనార్దన్ రెడ్డి పార్టీ అయిన తెలంగాణ నగారా సమితి ఉంటే, హరీశ్వర్ రెడ్డి తెరాసాలో చేశారు. మొత్తానికి స్పీకర్ అసెంబ్లీ సమావేశాల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more