ఒక్క మంత్రి పై వేటు వేయటంతో .. కాంగ్రెస్ పార్టీ సీనియర్సీనియర్ మంత్రుల్లో అలజడి మొదలైంది. అధిష్టానం ఎప్పుడు ఎవరి మీద వేటు వేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. ఆ భయంతో అందరు ఢిల్లీ బాట పట్టారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకొని పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం పిలుపు మేరకే పార్టీ వ్యవహారాలు చర్చించడానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి చేరుకున్నారు. తెలంగాణ, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు చర్చించడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
అధిష్టానం నిర్ణయం మేరకే డి.ఎల్. రవీంద్రారెడ్డిపై వేటు పడిందని భావిస్తున్న అసమ్మతి వాదులు తాము మరో డి. ఎల్. కాకూడదనే ఆలోచనతోనే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు ఢిల్లీకి పయనమవుతున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించిన డి.ఎల్. రవీంద్రారెడ్డిపై వేటు పడటంతో కిరణ్ సర్కార్లోని అసమ్మతి వాదులు ఉలిక్కిపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఒకరిద్దరు సీనియర్ మంత్రులు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకే ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇద్దరు మంత్రులతో రాజీనామాలు చేయించడం, మరో సీనియర్ మంత్రిని బర్తరఫ్ చేయడం, ఇద్దరు ఎంపీలు తెరాసలో చేరినా పట్టించుకోని పరిణామాలతో అసమ్మతి వాదులు భయాందోళనకు గురవుతున్నారు. అధిష్టానం రాష్ట్ర వ్యవహారాలపై సీరియస్గా ఉందన్న బావన వారిలో ప్రబలంగా ఏర్పడింది. సీనియర్ మంత్రి డాక్టర్. డి.ఎల్. రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేసిన తీరు సహేతుకంగా లేదని పార్టీ సీనియర్లు, పలువురు రాష్ట్ర మంత్రులు భావిస్తున్నప్పటికీ, అది అధిష్టానం నిర్ణయం కావడంతో ఢిల్లి స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేసే సాహసం చేయలేకపోతున్నారు. అధిష్టానం వైఖరి వల్లనే పార్లమెంటు సభ్యులు పార్టీకి దూరమయ్యారన్నది వారి భావన.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more