సురభి నాటకాలు ఆంధ్రప్రదేశ్ లో శతాబ్దాల నుంచి ఆడుతూ ఆంధ్రులను అలరిస్తూ వస్తున్నాయి. తోలు బొమ్మలాటలు అంతరించిన కాలం నుంచి నాటకాల బాట పట్టిన కళారంగంలో సురభి నాటకాలకు ప్రత్యేక స్థానం ఉంది. అది ఏమిటంటే ట్రిక్స్. నారదుడు ఆకాశంలోంచి కిందికి దిగటం, యుద్ధ భూమిలో రథాలు, భూదేవి నేలలోంచి పైకి రావటం, చిన్ని కృష్ణుడు నోరు తెరిచి పదునాలుగు భువనాలను చూపించటం లాంటి ఎన్నో చమత్కారాలను ప్రేక్షకులు అబ్బురపడేలా చేసి మెప్పించినవారే సురభి కళాకారులు. సురభి నాటకాలకున్న మరో ప్రత్యేకత ఎక్కువగా పౌరాణిక నాటికలనే ప్రదర్శించటం. వాటిలోనే వైర్ ట్రిక్కులకు ఎక్కువ అవకాశం ఉంటుంది, అవసరం పడుతుంది కాబట్టి.
మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు ఏకంగా ఖండాంతరాలలోకి వెళ్తున్నదీ కళ. మే 4 నుంచి 18 వరకు ఫ్రాన్స్ లో జరుగుతున్న అంతర్జాతీయ నాటకోత్సవాలలో ప్రదర్శనకు వెళ్తోంది సురభి నాటక బృందం. మాయా బజార్, శ్రీకృష్ణ లీలలు, భక్త ప్రహ్లాద నాటకాలను మొదటి రెండు వారాలలో మేజ్ నగరంలో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత పారిస్ లో సెంట్ క్వాట్రే కల్చరల్ సెంటర్లో మొదటి రెండు నాటకాలను మరోసారి ప్రదర్శిస్తారు. వాటిని ఫ్రెంచ్ కల్చరల్ మినిస్టర్ తిలకిస్తారు.
ఉక్రైన్, రష్యా, నార్వే, జెక్ రిపబ్లిక్, ఇటలీ, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, స్లోవేనియా, టునీషియా, ఇజ్లాయిల్ దేశాలనుంచి కూడా నాటక ప్రదర్శనలకు విచ్చేస్తున్న సందర్భంలో భారత్ నుంచి కేవలం సురభి నాటక బృందం మాత్రమే వెళ్తోంది.
సురభి నాటకాల మీద డాక్యుమెంటరీ కూడా తయారవుతోంది. దాన్నిఫ్రాన్సలో ప్రదర్శించబోతున్నారు. 43 కళాకారులోతోనూ వాళ్ళ సరంజామాతో విదేశాలకు పోవటమంటే ఖర్చుతో కూడుకున్నపని కాబట్టి, ఆంధ్రా నాటక కళాపరిషత్ ఇంకా కొన్ని కళా రంగంలోని సంఘాలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ తరఫునుంచి 20 ఫ్లైట్ టికెట్లు, ఎయిర్ ఇండియా తరఫునుంచి తగ్గించిన రేట్లతో సురభి నాటక బృందానికి చేయూతనిస్తున్నాయి.
ఫ్రాన్స్ లో జరిగే సురభి నాటకాలను ప్రేక్షకులకు అర్థమై రసాస్వాదన చెయ్యటం కోసం ఫ్రెంచ్ భాషలోకి అనువదించి స్టేజ్ పై భాగంలో సబ్ టైటిల్స్ గా ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగాయి. సురభి కళాకారులంతా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసారు. 125 సంవత్సరాల మా కృషి ఊరికే పోదంటూ సంతోషంగా తెలియజేసారు. 35 రోజుల వారి విదేశ పర్యటనలో సురభి నాటకరంగంలోని ఏడవ తరం కళాకారులు కూడా ఉన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more