పూర్తిగా ఎలక్ట్రికల్ కారు మహీంద్రా రేవా చండీగఢ్ లో విడుదలయింది.
మహీంద్రా ఇ-20 గా పేరుపెట్టిన ఈ కారు పూర్తిగా ఎలక్ట్ర్రిక్ కారు కాబట్టి కాలుష్యాన్ని కలిగించే వాయువులు ఇంజన్ లోంచి బయటకు రావటమనేది ఉండదు. వినియోగదారులకు సౌకర్యంగానూ, ఎక్కువ ఖర్చు లేకుండానూ ఈ కారు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ లోని ఛీఫ్ కస్టమర్ కేర్ ఆఫీసర్ ఈ కార్ ని విడుదల చేస్తున్న సందర్భంలో అన్నారు. మహీంద్రా రేవా ఎలక్ట్ర్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ చంద్రమౌళి మాట్లాడుతూ, చమురు ఇంధనంతో నడిచే వాహనాలకు ఇది చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు.
9.18లక్షల ఖరీదు చేస్తున్న ఈ కారు మీద 30 శాతం రాయితీ ఇవ్వవలసిందిగా కంపెనీ చండీఘడ్ పాలకవర్గానికి అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం దీన్ని 1.5 లక్షల రూపాయలు ముందుగా కట్టి నెలకి 12802 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలకు సులభ వాయిదాలు కట్టే పద్ధతిని ప్రవేశపెట్టారు.
దీని వలన కాలష్యరహితమైన, మానవుల ఆరోగ్యం, పర్యావరణాల దృష్ట్యా ఈ కారు సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. ఈ కారు ఆటోమేటిక్ అవటం వలన గేర్ లను మార్చ వలసిన పని ఉండదు కాబట్టి సిటీలలో నడపటానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, రద్దీ సమయాలలో ఒక వాహనం వెనకాలే మరొకటి పోతున్నప్పుడు ఆటోమేటిక్ కార్లు నడపటం లో చౌలా సౌలభ్యం ఉంటుందని కంపనీ అధికారులు తెలియజేసారు.
నలుగురు కూర్చుని ప్రయాణం చెయ్యగలిగే ఈ కారుకి పవర్- లిథియమ్ ఐయాన్ బ్యాటరీలు, ఒక త్రీఫేజ్ ఇండక్షన్ మోటార్. లాప్ టాప్, సెల్ ఫోన్ లలా ఛార్జింగ్ దీన్ని లో పెట్టుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు నడుస్తుందని చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా ఈ కారు లాక్ చేసుకోవటం, ఎయిర్ కండిషనర్ ని ఆపరేట్ చేసుకోవటం చెయ్యవచ్చు. కంపెనీ ఇస్తున్న జిపిఎస్ నేవిగేషన్, రేడియో, డివిడిలతో పాటు ఐ పాడ్ ని కనెక్ట్ చేసుకోవటానికి ఏర్పాటును కూడా ఇందులో చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more