అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీదకు మళ్ళినట్టుంది. ఈ నెల 18 న చర్చలకు రమ్మని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణలకు పిలుపునిచ్చారు రాహుల్. ఫిబ్రవరి 15 న కూడా రాహుల్ ఆ ఇద్దరూ చర్చలు జరిపారు.
ఎన్నికలకు దీర్ఘకాలిక కసరత్తులలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల మీదా దృష్టి పెడుతున్నది. కాంగ్రెస్ పట్టు చిక్కించుకోవటానికి కొన్ని రాష్ట్రాలలో పథకాలు వేస్తే, ఉన్న పట్టుని జారవిడుచుకోకుండా చూసుకునే పనులు కొన్ని రాష్ట్రాల్లో.
రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ సంక్షేమ పథకాలను విరివిగా గుప్పిస్తున్న ముఖ్యమంత్రి ఆయా సంక్షేమ పథకాల ప్రభావం ప్రజల మీదా, ప్రతిపక్షాల మీద, ప్రభుత్వ ఖజానా మీద ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించవలసివుంది.
రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల మీద ఇద్దరు నాయకుల నుంచి వివరాలు తీసుకోవటమే భేటీకి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఏ చిన్న విషయమైనా విషమంగా పరిణమించవచ్చు, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారవచ్చు కాబట్టి, ఈ మధ్య రాజుకుంటున్న మంత్రుల మీద సిబిఐ ఛార్జ్ షీట్ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వా తక్షణ కర్తవ్యం గురించి నిర్ణయం తీసుకోవటం ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. జగన్ కేసు తిరగదోడుతుంటే ఉచ్చు కాంగ్రెస్ మెడకే బిగుసుకుంటోంది. గతంలో పాస్ చేసిన 26 జివోల మీద సంతకాలు పెట్టిన మంత్రుల మీద దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి ధర్మాన పేర్లుండటం, ఇంకా కొందరు మంత్రుల పేర్లు క్యూలో ఉండటం దృష్ట్యా కాంగ్రెస్ కి ఇదో కొరుకుడు పడని విషయంగా తయారైంది.
మంత్రులను వెనకేసుకొస్తే జగన్ తప్పు లేనట్టవుతుంది. మంత్రులను వాళ్ళ మానానికి వాళ్ళని వదిలేస్తే పార్టీకే చెడ్డపేరు వస్తుంది, అంతర్గతంగా కూడా పార్టీలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు రాజకీయ సమీక్షలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఏ చిన్న విషయాన్ని విస్మరించకూడదని అనుకుంటున్న సందర్భంలో విపక్షాల చేతికి కొరడా స్వయంగా ఇచ్చినట్టే అవుతుందేమో అని రాజకీయ పరిణామాల మీద ఏమరుపాటు లేకుండా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశం కూడా మరోసారి తెరమీదకు రావచ్చని రాజకీయవర్గాలలో వినిపిస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more