కాన్వెంట్ స్కూల్స్, కంప్యూటర్ విద్య, ఇంటర్ నెట్ వాడకం- ఇవన్నీ ప్రాంతీయ భాషను మర్చిపోయేట్టుగా చేస్తున్నాయని భాషాభిమానులు ఎంతో కాలంగా, సందర్భం వచ్చినప్పుడల్లా, తమ బాధను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాయకులలోనూ పెద్దగా చదువుకున్నవారుండరు, పైగా అందరికీ అర్థం కావాలంటే ప్రాంతీయ భాషను మించింది మరొకటి లేదు కాబట్టి తప్పని సరిగా నాయకులు ప్రాంతీయ భాషలోనే మాట్లాడతారు. అంతే కానీ అదంతా భాషాభిమానమేమీ కాదు.
తమ పార్టీ గురించి చెప్పుకోవటానికి కానీ, ఇతర పార్టీలను విమర్శించటానికి కానీ వాడవలసిన భాష అక్కడి ప్రాంతపు జనం వాడే భాషే కాబట్టి, అందుకు ప్రతిగా ఇతర పార్టీలు కూడా విమర్శనాస్త్రాలు సంధించటం, ఎత్తుకు పై ఎత్తుగా తెలివిగా మాట్లాడటం, వీలయితే సామెతలు, పిట్టకథలను వినిపించటం, కుదిరితే కాస్తంత ప్రాస కలిసేట్టుగా మాట్లాడటం- ఇలాంటి ప్రయత్నాలలో భాష మీద వాళ్ళకి తెలియకుండానే పట్టు వస్తోంది, భాష లోని పదాలు అంతరించకుండా ఉండటమే కాకుండా కొత్త కొత్త ప్రయోగాలు, పాతవి వెతికి తీయటాలు కూడా జరుగుతాయి.
అయితే ఈ పనులన్నీ చేసి భాష మీద పరిశోధన చేసేంత సమయం నాయకులకు లేదు కానీ, వాళ్ళ దగ్గర పనిచేసే కంటెంట్ రైటర్స్ వాళ్ళకాపని చేసిపెడతారు. అలా వాళ్ళు ఉపయోగించిన పదాలు ప్రచారంలోకి వచ్చి ప్రాంతీయ భాష వృద్ధి చెందటం జరుగుతుంది. దానికి తోడు ఎలక్ట్రానిక్ మీడియా అభివృద్ధి చెంది అవికూడా నాయకుల మాటలను ఇంకా సొంపుగా చెప్తూ ప్రసారం చెయ్యటం మొదలుపెట్టటం, చర్చా వేదికలను నిర్వహించటం చెయ్యబట్టి భాష ఇంకా పదునెక్కుతోంది.
తెలుగు రానట్లుగా మాట్లాడటం, మధ్య మధ్య ఇంగ్లీషు ముక్కలు చేర్చటం లోంచి ఎక్కువుగా ఇంగ్లీషు పదాలను వాడటం, వాక్యాలను మాత్రం తెలుగు వ్యాకరణం ప్రకారం కర్త కర్మ క్రియలలో పొందుపరచటం లోకి పరివర్తన చెందుతున్న సమయంలో రాజకీయ నాయకులు ప్రాంతీయ భాషకు కాపు కాసి అవి అంతరించిపోకుండా చేసారు. విద్య, వ్యాపార, ఉద్యోగాలలో ఇంగ్లీషు వాడకం పెరిగిపోతున్న సమయంలో జనజీవనాన్ని ప్రభావితం చేసే ప్రాంతీయ, రాష్ట్ర, దేశ రాజకీయాలు ప్రాంతీయతకే తమ ఓటు వేస్తున్నాయి.
ఇది అన్ని రాష్ట్రాలలోనూ, అన్ని ప్రాంతాలలోనూ జరుగుతున్నదే. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత హిందీ వాడకం బాగా పెరిగిపోయింది. అలాగే బీహారి, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, హర్యానవి, తమిళ, కన్నడ, మళయాల, ఒడియా, బంగ్లాలు కూడా అభివృద్ధి చెందాయి.
పాతరెయ్యటం, బొందపెట్టటం, మెడలు వంచటం, (ప్రభుత్వం) దిగిరావటం, ఆత్మగౌరవం, దుర్మార్గం, నీచమైన, సిగ్గులేకుండా లాంటి పదాలు తెలంగాణా ఉద్యమంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వాడకంలో లేని పదాలు ఇప్పుడు విరివిగా వాడుతున్నారు, అందులో ఈ క్రిందివి బహుళ వాడకం లోకి వచ్చాయి.
1.మనోభావాలు 2. స్పందన, 3. చిత్త శుద్ధి, 4. ఘనమైన, 5. పూర్వ వైభవం, 6. అవినీతి, 7. అధికారం, 8. కళంకితులు, 9. జవాబుదారీ, 10, ప్రజాశ్రేయస్సు, 11. పార్టీలకు అతీతంగా, 12. ప్రజా సంక్షేమం, 13. అడ్డుకోవటం, 14. కుమ్మక్కవటం, 15. కలుషితం, 16. దాడి చెయ్యటం, 17. అనుమానస్పదం, 18. దౌర్జన్యం, 19. సభాముఖంగా, 20, సభామర్యాద 21. అడ్డదారి–ఇంకా ఎన్నో. గబుక్కున మనసులోకి వచ్చినవి మాత్రమే ఈ పైన రాసిన పదాలు.
ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషలకు ఢోకా లేదని స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి భాషా ప్రేమికులు ఆందోళన చెందవలసిన అవసరమెంత మాత్రం లేదు. దానికి తోడు తెలుగు బాట కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రచించారు. పాఠ్యభాగాల దగ్గర్నుంచి నిఘంటువుల వరకూ మార్పులూ చేర్పులూ చేసుకోబోతున్నాయి.
అందువలన, ఈ తరం మారి కొత్త తరంలోని యువత ఉద్యోగాల మీద మోజు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, భాషా సాంప్రదాయాలకు బైబై చెప్తే తప్ప, ఇంకా చాలా సంవత్సరాలు తెలుగు జీవిస్తుందని ఘంటాపధంగా చెప్పవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more