తెలుగు భాషకు పూర్వ వైభవం తీసుకునిరావటం కోసం ఈ సంవత్సరం తెలుగు భాష పునరుద్ధరణకు కేటాయిస్తామని నిన్న రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలుగు బాట పేరుతో చెయ్యబోయే ఈ కార్యక్రమ వివరాలను తెలియజేస్తూ, దీనికి 25 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించామని, రెండు నెలలకోసారి నెహ్రూ యువ కేంద్రాలు, బాల భవన్ లలో రెండు నెలలకోసారి గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో తెలుగు సంస్కృతిని కాపాడేందుకు కార్యక్రమాలు జరుగుతాయన్నారాయన.
ఈ తెలుగుబాట కార్యక్రమంలో భాగంగా, పబ్లిక్ పార్క్ లలో కొంత భాగాన్ని తెలుగు తోట పేరుతో విడిగా ఆరక్షణకు ఏర్పాటు చేస్తామన్నారాయన.
ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగు పాఠ్యపుస్తకాలలో తెలుగులో మార్పులు తెస్తూ, తెలుగు పద్యాలకు, సామెతలకు, తెలుగు గడ్డ మీది విశేష వ్యక్తుల జీవితగాధలకు స్థానమిస్తామని కిరణ్ కుమార్ చెప్పారు. తెలుగు నిఘంటువుల ఆధునికీకరణలో కొత్తగా వచ్చిన పదాలను చేరుస్తామని చెప్పారు. తెలుగు అకాడమీలను పునరుద్ధరించటం, పదో తరగతి వరకు తెలుగు భాషను పాఠ్యభాగాలలో ఉంచటం చేస్తామని చెప్పిన కిరణ్ కుమార్, తెలుగు పునరుద్ధరణకు కేవలం ప్రభుత్వం పాటు పడితే సరిపోదని, తెలుగు ప్రజలందరి సహకారం ఉండాలని ఆయన అన్నారు.
పంచాంగ పఠనం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు సి.వి.బి.సుబ్రహ్మణ్యం, విజయ నామ సంవత్సరం తెలుగువారికి శుభకరమైనదని, సకాల వర్షాలతో పాడిపంటలతో తెలుగు నేల అలరారుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కొన్ని ఒడిదుడుకులకు లోనైనా నిలదొక్కుకుంటారని కూడా సుబ్రహ్మణ్యం తెలియజేసారు.
ఏ పని చేసినా రాజకీయ దృష్టితోనే చేస్తారన్నదీ నిజమే కానీ మంచి పనులు చేసినా రాజకీయమే అనే వాళ్ళూ ఉంటారు. ఎందుకోసం చేసినా మంచి పని మంచి పనే కదా. దాని వలన రాజకీయ లబ్ధి పొందుదామని... అంటూ విమర్శిస్తే ఎలా. సాయం చేసినా, పుణ్యం కొట్టేద్దామన్న ఆశ అన్నట్లే ఉంటుంది.
తెలుగువారి ఆత్మగౌరవం అన్న నినాదంతో పార్టీ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా శక్తిని పుంజుకుంటున్నది. ఎన్నికల్లో ఓట్లు కొద్దిగా అటు పోతే ఆ పార్టీ గెలవచ్చు, ఇటు వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది. అందువలన, అదే పంథాలో తెలుగు భాష పునరుద్ధరణకు పూనుకుని తెలుగు దేశం పార్టీకి దీటుగా ఆ కోణంలోనూ ఎదుర్కోవటం కోసం కాంగ్రెస్ యత్నిస్తున్నదనుకున్నా, చేస్తున్నది ఒక మంచి పనేగా, చెయ్యనివ్వండి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more