నిన్న రాత్రి హైద్రాబాద్ లలితకళా తోరణంలో అత్యంత వైభవంగా జరిగిన 2011 సంవత్సరానికిగాను జరిగిన చలనచిత్ర నంది పురస్కార వేడుకలలో హిందీ విలక్షణ నటుడు అమితాభ్ బచ్చన్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ మున్ముందుగా తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అని సుస్పష్టమైన తెలుగులో అనటంతో చప్పట్లు మిన్నుముట్టాయి. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు-
సినిమా హాల్లో కూర్చున్నప్పుడు పక్కన కూర్చున్నవాళ్ళు ఏ కులం, ఏ మతానికి చెందినవారన్నది ఆలోచించం. సినిమా చూస్తున్నప్పుడు కలిగే భావోద్వేగాలు అందరికీ సమానంగా కలుగుతాయి, అది సంతోషమే కావొచ్చు లేదా దుఃఖమే కావొచ్చు కానీ ఆ భావాలు అందరిలోనూ సమానంగా కలుగుతాయి. సమైక్యభావనకు సినిమాలు సూచికలు. దేశసమైక్యతకు సినిమాలు ఉపకరిస్తాయి అన్నారు అమితాభ్
ఆ తర్వాత ఎన్టీఆర్ పేరుతో చేస్తున్న ఈ సత్కారంలో ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ, ఆయన భరత భూమి గర్వపడే గొప్ప పుత్రుడని శ్లాఘిస్తూ, ఆయనతో తనకు గల అనుబంధాన్ని అమితాభ్ గుర్తు చేసుకున్నారు. తాను నటించిన హిందీ సినిమాలు తెలుగులో పునర్నిర్మాణం జరిగిన సందర్భంలో ఎన్టీఆర్ అందులో నటించారని, అలాగే ఆయన సినిమాలు హిందీలో పునర్నిర్మంచినప్పుడు తాను నటించటం జరిగిందని, ఎన్నో సందర్భాల్లో తామిద్దరం ఎన్నో విషయాలను చర్చించుకునేవాళ్ళమని అమితాభ్ అన్నారు. భారతీయ సినిమా వందో సంవత్సరంలో అడుగుపెడుతోందని కూడా ఆయన గుర్తుచేసారు. మొట్టమొదటి రాజా హరిశ్చంద్ర సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే 1913 లో రూపొందింది.
నాగిరెడ్డి చక్రపాణి జాతీయ పురస్కారాన్ని నిర్మాత ఆదిశేషగిరిరావుకి, రఘుపతి వెంకయ్య నాయుడు జాతీయ పురస్కారాన్ని కైకాల సత్యనారాయణకు అందించటం జరిగింది.
ఉత్తమ నటుడిగా మహేష్ బాబు (దూకుడు), ఉత్తమ నటిగా నయనతార (శ్రీరామరాజ్యం), ఉత్తమ చిత్రంగా ఎంపికైన శ్రీరామరాజ్యం నిర్మాత సాయిబాబు అమితాభ్ చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ ప్రతినాయికగా మంచు లక్ష్మి, ఉత్తమ దర్శకుడుగా ఎన్.శంకర్, ఉత్తమ స్క్రీన్ ప్లేకి శ్రీను వైట్ల, ఉత్తమ గీతరచయితగా మిట్టపల్లి సురేందర్, ఉత్తమ మాటల రచయితగా నీలకంఠ కూడా అమితాభ్ చేతుల మీదుగా నంది పురస్కారాలను అందుకున్నారు. ఛార్మీ, నాగార్జునలు ఉత్తమ జ్యూరీ అవార్డ్ ని గ్రహించారు.
ఈ వేడుకలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు గీతారెడ్డి, ప్రసాద్ కుమార్, పితాని సత్యనారాయణ, దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత డి.రామానాయుడు, నిర్మాత అల్లు అరవింద్, గాయని, డబ్బింగ్ కళాకారిణి సునీత, నటుడు రాజశేఖర్, జీవిత, తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకోవలసిన గద్దర్, అమరుల స్వప్నమైన ప్రాంతీయ ప్రజాస్వామిక తెలంగాణా ఫలించనందుకు పురస్కారాన్ని తీసుకోవటం లేదంటూ ముందుగానే ఎఫ్ డి సి ఎమ్ డి కి లేఖ రాసి వేడుకకు కూడా హాజరుకాలేదు.
ఇంకా కొందరు నంది పురస్కార వేడుకలకు హాజరు కాలేకపోయారు. వారిలో, ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్, ఇళయరాజా, ప్రకాశ్ రాజ్, ఎన్.రవీందర్, బాపు, బాలకృష్ణ, శ్రీకాంత్, స్నేహ, కమలిని ముఖర్జీ, విజయేంద్ర ప్రసాదులున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more